ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీహరికోటలోని ఇస్రోను సందర్శించిన మైగవ్‌‌ జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ 2025 విజేతలు

प्रविष्टि तिथि: 20 NOV 2025 7:55PM by PIB Hyderabad

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలతో మమేకవ్వాలనే ప్రధాన లక్ష్యంతో.. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని పౌర అనుసంధాన వేదికైన మైగవ్.. అనేక కార్యక్రమాలను నిర్వహించిందిఅంతరిక్ష రంగంలో భారత్ సాగిస్తున్న అద్భుతమైన ప్రయాణంపై అవగాహన పెంచడంజ్ఞానాన్ని విస్తరించడమే లక్ష్యంగా సృజనాత్మక పోటీలుసోషల్ మీడియాలో సమాచార ప్రచారాలున్యూస్‌లెటర్లుబ్లాగులుపాడ్‌క్యాస్టులువీడియోలతో సహా ప్రజల కోసం అనేక పోటీలను మైగవ్ రూపొందించింది.

వీటిలో ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం క్విజ్ 2025’ ముఖ్యమైనదిభారత అంతరిక్ష కార్యక్రమంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికిశాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికివారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దీన్ని రూపొందించారుదేశవ్యాప్తంగా వేలాది మందిని ఈ కార్యక్రమం ఆకర్షించిందిఅలాగే.. 100 మంది విజేతలకు 2025 నవంబర్ 11న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట రేంజ్‌ (ఎస్డీఎస్సీ షార్వద్ద ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించే అవకాశాన్ని మైగవ్ అందించింది.

భారత్ చేపడుతున్న అంతర్జాతీయ స్థాయి పరిశోధనప్రయోగ కార్యకలాపాలకు సంబంధించి తెర వెనుక జరిగే సన్నద్ధతను అర్థం చేసుకొనే అవకాశం విజేతలకు ఈ పర్యటన అందించిందిభారత్ అంతరిక్ష ప్రయాణంప్రధాన విజయాలుఅత్యాధునిక సాంకేతికతల అభివృద్ధి అంశాలపై నిర్వహించిన చర్చల్లో సీనియర్ శాస్త్రవేత్తలుఅధికారులతో విజేతలు ముచ్చటించారుఈ నిర్దేశిత పర్యటనలో భాగంగా భారత వాహక నౌకలను అంతరిక్షంలోకి పంపించే మాస్టర్ కంట్రోల్ సెంటర్లాంచ్ ప్యాడ్ 1,2లను సందర్శించే అవకాశం వారికి లభించిందిరాకెట్లను తయారీపరీక్షతరలింపుప్రయోగ మౌలిక వసతులను పరిశీలించారుఇది మిషన్ విజయవంతంగా పూర్తయ్యేలా చేసే కఠినమైన సన్నాహక ప్రయత్నాలకు సంబంధించి తెలుసుకొనే అరుదైైన అవకాశాన్ని ఇచ్చింది.

దీనిని ‘‘జీవితంలో ఒక్కసారి మాత్రమే దక్కే అవకాశం’’గా విజేతలు ఈ అనుభవాన్ని వర్ణిస్తూ.. ఇస్రో చేపడుతున్న ఆవిష్కరణలుకచ్చితత్వందేశ పురోగతి పట్ల అంకితభావాన్ని ప్రశంసించారుసైన్స్ఇంజినీరింగ్పరిశోధనారంగాల్లో తమ కెరీర్‌ను కొనసాగించాలనే సంకల్పాన్ని ఈ సందర్శన బలోపేతం చేసిందని దీనిలో పాల్గొన్న వారిలో చాలామంది తెలియజేశారు.

ఆవిష్కరణలుఅంతర్జాతీయ సహకారంలో ఇస్రో చేస్తున్న నిరంతర కృషి ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతోందిప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్‌తో సహా త్వరలో చేపట్టబోయే గ్రహాంతర అన్వేషణతో అంతరిక్ష శాస్త్రంసాంకేతికతల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందిశాస్త్రీయ విజ్ఞానాన్ని అందరికీ అందించడంతర్వాతి తరం ఆవిష్కర్తలనుఅన్వేషకులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ నిబద్ధతను జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ లాంటి కార్యక్రమాలు తెలియజేస్తాయి.

2023లో చంద్రయాన్-3పై నిర్వహించిన మహాక్విజ్‌తో మొదలుపెట్టి జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ 2024, ఇప్పుడు 2025 సంచికతో జాతీయ స్థాయిలో అంతరిక్ష క్విజ్‌లను వరుసగా మూడో ఏడాది విజయవంతంగా మైగవ్ నిర్వహించడాన్ని ఈ పర్యటన సూచిస్తుందిప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభావంతులు ఇస్రో క్యాంపస్‌లో చేపట్టే స్ఫూర్తిదాయకమైన వైజ్ఞానిక యాత్రతో ఈ కార్యక్రమం ముగుస్తుందికొనసాగుతున్న ఈ ప్రయత్నాల ద్వారా భారత్ అంతరిక్ష విజయాలతో ప్రజలను మైగవ్ అనుసంధానిస్తుందిఅలాగే ప్రశ్నించే స్ఫూర్తినిఆవిష్కరణలనుజాతీయ గర్వాన్ని ప్రోత్సహిస్తుంది.

***

 


(रिलीज़ आईडी: 2192376) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी