ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వస్త్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్’ కింద మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పిన భారత్

प्रविष्टि तिथि: 31 OCT 2025 7:27PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘స్వస్త్ నారీసశక్త్ పరివార్ అభియాన్ (ఎస్ఎన్ఎస్‌పీఏ)’లో మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయినివారణమహిళా కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పట్ల భారత్‌కు ఉన్న సాటిలేని నిబద్ధతను ఇది తెలియజేస్తోంది

రికార్డులు ఈ విధంగా ఉన్నాయి:

ఆరోగ్య సంరక్షణ వేదికగా ఒక నెలలో అత్యధిక నమోదులు – 3,21,49,711 (మూడు కోట్ల 21 లక్షల 49 వేల 711 మంది)

రొమ్ము క్యాన్సర్ పరీక్ష కోసం ఒక వారంలో ఆన్‌లైన్‌లో అత్యధిక నమోదులు – 9,94,349 (తొమ్మిది లక్షల 94 వేల 349 మంది)

కీలక పరీక్షల కోసం ఒక వారంలో ఆన్‌లైన్‌లో అత్యధిక నమోదులు (రాష్ట్ర స్థాయిలో) – 1,25,406 (ఒక లక్ష 25 వేల 406 మంది)

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోషణ్ మాసానికి అనుగుణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా ‘స్వస్త్ నారీసశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారుఇది మహిళలుకౌమార బాలికలుపిల్లల ఆరోగ్యంపోషకాహారాలపై దృష్టి సారిస్తోందిత్వరగా వ్యాధులను గుర్తించడంఅవసరమైన ఆరోగ్య సేవలను అందించడంసామర్థ్యంతో ఆరోగ్యంగా ఉండే భారత్‌ కోసం మంచి జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.

సేవను సంకల్పంగా 'దేశమే ప్రథమంఅనే స్ఫూర్తిని తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. "మన తల్లులుఆడపడుచులుమన మహిళా శక్తి మన దేశ ప్రగతికి పునాదిఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది." అని వ్యాఖ్యానించారు

దేశంలోని ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుఇందులో 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు జరిగాయిఅన్ని ఆరోగ్య సంరక్షణ వేదికలలో 11 కోట్లకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారుమొత్తంగా ఈ పథకం అపూర్వమైన స్థాయిలో విజయాన్ని సాధించింది

ఈ కార్యక్రమంలో 20కి పైగా మంత్రిత్వ శాఖలు క్రియాశీలకంగా పాల్గొన్నాయిఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలువైద్య కళాశాలలుప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయిపార్లమెంట్ సభ్యులుశాసనసభ్యులుఅన్ని సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు కూడా ఇందులో పాలుపంచుకోవటంతో ఇది ఏకోన్ముఖ ప్రభుత్వ కార్యక్రమంగా మారింది

ఏకోన్ముఖ సమాజం అనే విధానాన్ని అనుసరించడం వల్ల ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కనిపించిందిఇందులో లక్షలకు పైగా పంచాయతీ రాజ్ ప్రతినిధులు, 1.14 కోట్లకు పైగా పాఠశాలకళాశాల విద్యార్థులు, 94 లక్షల స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీసభ్యులు, 5 లక్షల ఇతర సామాజిక వేదికల సభ్యులు పాల్గొన్నారుతద్వారా ఇది అత్యంత భారీ సామాజిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 1.78 కోట్లకు పైగా అధిక రక్తపోటు పరీక్షలు, 1.73 కోట్ల మధుమేహం పరీక్షలు, 69.5 లక్షల నోటి క్యాన్సర్ పరీక్షలు, 62.6 లక్షల ప్రసవ పూర్వ సంరక్షణ పరీక్షలు, 1.51 కోట్ల రక్తహీనత పరీక్షలు,  85.9 లక్షలకు పైగా మహిళలకు క్షయ వ్యాధి పరీక్షలు, 10.2 లక్షల మందికి సికిల్ సెల్ వ్యాధి పరీక్షలను నిర్వహించారు. 1.43 కోట్ల టీకా మోతాదులను పంపిణీ చేయగా.. 2.14 కోట్ల మంది కౌన్సెలింగ్ఆరోగ్య సంరక్షణ సెషన్లకు హాజరయ్యారుఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు 2.68 లక్షలకు పైగా నిక్-శయ్ మిత్రాలు నమోదు చేసుకున్నారు.  ఇందులో మై భారత్ వాలంటీర్లు చురుగ్గా పాలుపంచుకున్నారు.

గిన్నీస్ సంస్థ నుంచి వచ్చిన ఈ గుర్తింపు.. ప్రభుత్వ వ్యవస్థలుడిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలుసామాజిక భాగస్వామ్యాన్ని మిళితం చేస్తూ ‘ఆరోగ్యవంతులైన మహిళలుసాధికారత పొందిన ఇళ్లువికసిత్ భారత్‌"ను తయారుచేసేందుకు భారత్ ‌చేసిన సామూహిక కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2185542) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Marathi , English , Urdu