వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ లో బొగ్గు, రవాణా రంగాల్లో డిజిటల్ మార్పునకు ఊతమిచ్చే కోయ్లా శక్తి డాష్‌బోర్డ్ ప్రారంభం


ఏకీకృత, డేటా ఆధారిత పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధికి ఎన్ఐసీడీసీ ప్రయత్నంలో ప్రధాన మైలురాయిగా కోయ్లా శక్తి

యులిప్ (యూఎల్ఐపీ) తో నడిచే ఎన్ఐసిడిసి కోయ్లా శక్తి వేదిక ద్వారా బొగ్గు రంగానికి నిరంతర పర్యవేక్షణ, ఆధునిక రవాణా సదుపాయాలు

Posted On: 29 OCT 2025 6:47PM by PIB Hyderabad

వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీడిజిటల్ మార్పుఆధునిక రవాణా (స్మార్ట్ లాజిస్టిక్స్వైపు భారత్ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తూ ‘కోయ్లాశక్తి‘ స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్ బోర్డు (ఎస్సిఏడీను ప్రారంభించిందిబొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐసిడిసి ఈ వేదిక (ప్లాట్ ఫారమ్ను అభివృద్ధి చేసిందియూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫామ్ (యూఎల్ఐపిద్వారా ఇది పని చేస్తుంది

భారత బొగ్గురవాణా రంగాల్లో సాంకేతికతడేటా ఆధారిత పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడంలో కోయ్లా శక్తి ఒక ముఖ్యమైన ముందడుగుబొగ్గు ఉత్పత్తిరవాణావినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఈ వేదిక దోహదపడుతుందిమొత్తం విలువ శ్రేణిలో అధిక సామర్థ్యంపారదర్శకతసుస్థిరతను ప్రోత్సహిస్తుందికేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఈ వేదికను ప్రారంభించారుడిజిటల్ ఇండియారవాణా ఆధునికీకరణను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగాఏకీకృత విశ్లేషణ విధానం ద్వారా బహుళ వ్యవస్థలను అనుసంధానించే తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో విస్తరిస్తున్న ఎన్ఐసిడిసి పాత్రను కోయ్లా శక్తి ప్రదర్శిస్తుందికోయ్లా శక్తి వేదిక 2022లో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ కింద ఏర్పాటయిన డిజిటల్ గేట్‌వే యులిప్ ను వినియోగిస్తూరైల్వేలురేవులుకస్టమ్స్‌బొగ్గు ఉత్పత్తిదారులువిద్యుత్‌ వంటి రవాణా ఆధారిత కేంద్రాల మధ్య భద్రతతో కూడినఅంతరాయం లేని సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది

15 పోర్టుల నుంచి సేకరించిన సమాచారం, 48కి పైగా ఏపీఐల ఏకీకృతం ద్వారా కోయ్లా శక్తి వేదిక బొగ్గు సరఫరా రంగంలో తక్షణ సమాచారాన్ని అందిస్తుందిఇది ‘ఒక దేశం ఒక డాష్‌బోర్డ్‘ విధానానికి నమూనాగా నిలుస్తుందిఈ ఆవిష్కరణ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి నుంచి జాతీయ డిజిటల్ మౌలిక వసతులుఈ గవర్నెన్స్‌ రంగాల వరకు తన నైపుణ్యాన్ని విస్తరించడంలో ఎన్ఐసీడీసీ సాధించిన విజయాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.

కేంద్ర మంత్రిత్వ శాఖలురాష్ట్ర మైనింగ్ విభాగాలువిద్యుత్ కేంద్రాలుఓడరేవులుప్రైవేట్ రంగంతో సహా కీలక భాగస్వాముల నుంచి డేటాను ఏకీకృతం చేయడం ద్వారా కోయ్లా శక్తి సంప్రదాయ బొగ్గు రవాణాను తెలివైనచురుకైనస్థిరమైన వ్యవస్థగా మారుస్తుందిపరిశీలనాత్మక విశ్లేషణస్థిరత్వంతో కూడిన పర్యవేక్షణ సాధనాలను సమీకరించడం ద్వారా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందిపర్యావరణ పరిరక్షణపరంగా జవాబుదారీతనాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

దీనిని అమలు చేసే సంస్థగా ఎన్ఐసీడీసీ భారత తయారీ సామర్ధ్యంరవాణా సామర్థ్యంఆధునిక (స్మార్ట్మౌలిక సదుపాయాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టులలో అగ్రగామిగా కొనసాగుతుందిపారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడంలోనూ పీఎం మిత్రా పార్కుల వంటి కార్యక్రమాలను నిర్వహించడంలోనూ విజయవంతమైన అనుభవంతోకార్పొరేషన్ ఇప్పుడు కోయ్లా శక్తి వంటి వేదికల ద్వారా సాంకేతికతలో తన నాయకత్వాన్ని విస్తరిస్తోందిఆవిష్కరణ ఆధారిత వృద్ధి పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తోంది.

కోయ్లా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ఎన్ఐసీడీసీ సీఈఓమేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రజత్ కుమార్ సైనీతో పాటు ఆయా సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు

 

***


(Release ID: 2184255) Visitor Counter : 5