ఆఫీసు ప్రాంగణాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయటానికి, పరిశుభ్రత పాటించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0ను ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) అమలు చేస్తోంది. సీజీఓ కాంప్లెక్స్ ఆవరణలోని కార్యాలయాల్లోనే కాక, పరిసరాల్లోనూ పరిశుభ్రంగా ఉండేలా డీపీఈ పర్యవేక్షిస్తుంది.
గతంలోలాగే ఈ ప్రచారం రెండు దశల్లో అమలవుతోంది:
-
ఫేజ్ I (16.09.2025 – 30.09.2025): సన్నాహక దశ – ఈ దశలో ఎంపీల సిఫార్సులు, పార్లమెంటరీ హామీలు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, అంతర మంత్రిత్వ శాఖల కమ్యూనికేషన్లు, ప్రజా ఫిర్యాదుల వంటి పెండింగ్ అంశాలను గుర్తిస్తారు. శుభ్రపరచాల్సిన, మెరుగుపరచాల్సిన, సుందరీకరించాల్సిన ప్రాంతాలను కూడా ఎంపిక చేస్తారు.
-
ఫేజ్ II (02.10.2025 – 31.10.2025): అమలు దశ - గుర్తించిన పెండింగ్ అంశాలను పరిష్కరించటం, ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వచ్ఛత, సుందరీకరణ, నిర్వహణ పనులను ఈ దశలో చేపడతారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఒక సీటీయూ స్థలాన్ని గుర్తించి దాన్ని సుందరీకరించారు. ఎంపీల సిఫార్సులు, పార్లమెంటరీ హామీలు, అంతర మంత్రిత్వ శాఖల కమ్యూనికేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, పీఎంఓ సిఫార్సుల అంశాలన్నీ పరిష్కరించారు. మొత్తం 550 ఫైళ్లను సమీక్షించి, తొలగించాల్సిన పాత ఫైళ్లను గుర్తించి, ఫేజ్ IIలో వాటిని తొలగించారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0 పురోగతిని సమీక్షించేందుకు కార్యదర్శి (డీపీఈ) 24 అక్టోబర్ 2025న డీపీఈ ఆవరణను తనిఖీ చేశారు. ఆఫీసులో వినియోగ స్థలాన్ని పెంచేందుకు, నిరుపయోగమైన వస్తువులు, ఏఐఓ, ప్రింటర్లు, డెస్క్ టాప్ లు వంటి స్క్రాప్ మెటీరియల్ ను గుర్తించి, వాటిని తీసివేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 45 వస్తువులను గుర్తించగా, వాటిని నిరుపయోగమని నిర్ధారించి, తొలగించే ప్రక్రియను 28.10.2025న చేపడతారు. దీని ద్వారా 180 చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి వస్తుంది.
****