యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

యూపీఎస్సీ అభ్యర్థుల ధ్రువీకరణకు ప్రయోగాత్మకంగా ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానం


ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు ప్రయోగం తెలివైన, సురక్షితమైన, సమర్థవంతమైన

పరీక్షా విధానానికి ముందడుగు: డాక్టర్‌ అజయ్‌ కుమార్‌

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2025 3:51PM by PIB Hyderabad

ఇటీవల (సెప్టెంబర్‌ 14నిర్వహించిన ఎన్డీఏఎన్‌ఏ II, సీడీఎస్ II పరీక్షల్లో‌ అభ్యర్థుల వేగవంతమైనసురక్షిత గుర్తింపు కోసం కృత్రిమ మేధ ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను పరీక్షించేందుకు ప్రయోగాత్మక కార్యక్రమాన్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ విజయవంతంగా‌ నిర్వహించింది.

జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం.. పరీక్షా ప్రక్రియలో నైతికతను పెంపొందించడంతో పాటుపరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రవేశాన్ని మరింత సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారుఇక్కడ అభ్యర్థుల ముఖ చిత్రాలను వారి నమోదు సమయంలో సమర్పించిన ఫోటోలతో డిజిటల్‌గా సరిపోల్చారుఈ కొత్త సాంకేతిక విధానంతో ప్రతి అభ్యర్థి ధ్రువీకరణకు 8-10 సెకన్ల సమయం మాత్రమే పడుతోందిదీని ద్వారా ప్రవేశ ప్రక్రియ మరింత వేగవంతమవడమే కాకుండా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయి.

యూపీఎస్సీ నిర్వహించిన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా వివిధ సెషన్లలో పాల్గొన్న 1,129 మంది అభ్యర్థులకు సంబంధించిన 2,700కు పైగా స్కాన్లు విజయవంతంగా పూర్తయ్యాయిఆధునిక సాంకేతికత వినియోగంతో మరింత తెలివైనసురక్షితమైనసమర్థవంతమైన పరీక్షా విధానాల దిశగా ప్రయోగం ఒక ముందడుగు.

‘‘పరీక్షల్లో న్యాయంపారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కమిషన్ కట్టుబడి ఉందికృత్రిమ మేధా ఆధారిత ముఖ గుర్తింపు ప్రయోగం... తెలివైనసురక్షితమైనసమర్థవంతమైన పరీక్షా విధానాల వైపు యూపీఎస్సీ చేస్తున్న ప్రయత్నంలో కీలక ముందడుగుకమిషన్‌ తన విధానాలను ఆధునికీకరించేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ.. మా ప్రక్రియల సమగ్రతను కాపాడటంలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం’’ యూపీఎస్సీ చైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌.

ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు గురించి డాక్టర్ అజయ్ కుమార్ ట్వీట్‌ కూడా చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2168329) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam