పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న 5 లక్షలకు పైగా విద్యార్థులు

Posted On: 18 AUG 2025 6:16PM by PIB Hyderabad

డిల్లీలోని పాఠశాలలుకేంద్రీయ విద్యాలయాలుజవహర్ నవోదయ విద్యాలయాలువిశ్వవిద్యాలయాలు/కళాశాలలుఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యువ పార్లమెంట్ కార్యక్రమం ద్వారా వివిధ యువ పార్లమెంట్ పోటీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందివీటిలో ఇప్పటి వరకు లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారుఈ పోటీల్లో విద్యార్థులు ముఖ్యంగా మారుమూలగ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారితో సహా విస్తృత స్థాయిలో పౌర భాగస్వామ్యాన్ని పెంచేందుకు జాతీయ యువ పార్లమెంట్ పథకం (ఎన్‌వైపీఎస్వెబ్ పోర్టల్ రూపొందించారుఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు ఒక లక్ష మంది పౌరులు పాల్గొన్నారుదేశంలోని అన్ని విద్యాసంస్థలు/బృందాలు/పౌరులు/విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చుపోర్టల్‌లోని ‘‘ఇనిస్టిట్యూషన్ పార్టిసిపేషన్’’, ‘‘గ్రూప్ పార్టిసిపేషన్’’ ద్వారా నిర్వహించే యూత్ పార్లమెంట్ సమావేశాల్లోనూఅలాగే ‘‘ఇండివిడ్యువల్ పార్టిసిపేషన్’’ ద్వారా ‘భారతీయ డెమోక్రసీ ఇన్ యాక్షన్’ అంశంపై నిర్వహించే క్విజ్‌లో పాల్గొనవచ్చుప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంక్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడంఇతరుల ఆలోచనల పట్ల సహనాన్ని పెంపొందించడంపార్లమెంటులో అనుసరించే పద్ధతులువిధానాలుప్రభుత్వ పనితీరురాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడంప్రజాస్వామ్య విధానంలో జీవించేలా ప్రోత్సహించడమే యూత్ పార్లమెంటు కార్యక్రమం ముఖ్యలక్ష్యం.

గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 600 విద్యా సంస్థలు, 35000 మంది విద్యార్థులు పోటీ ఆధారిత యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారుఅలాగే యూత్ పార్లమెంటు కార్యక్రమ పోర్టల్ ద్వారా 1800 యూత్ పార్లమెంటు సమావేశాలు నిర్వహించారుదీనిలో 66000 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సమాచారాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలుమైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానంగా ఈ రోజు రాజ్యసభలో అందించారు.

 

***


(Release ID: 2157758)
Read this release in: English , Urdu , Hindi , Punjabi