కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేవలు, డిజిటల్‌ పరివర్తనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిన హైదరాబాద్‌ బర్కత్‌పురా ఈపీఎఫ్ఓ


మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోన్న ప్రస్తుత తరుణంలో సభ్యులకు సంబంధించిన ఆవిష్కరణలు, పారదర్శక సేవల విషయంలో కేంద్రంగా నిలుస్తోన్న బర్కత్‌పూర్ ఈపీఎఫ్ఓ

Posted On: 16 JUN 2025 3:56PM by PIB Hyderabad

1952 నుంచి పనిచేస్తున్న హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి కొనసాగింపుగా ప్రారంభమైన బర్కత్‌పురాలోని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కార్యాలయం మరోసారి తన ఘనతను చాటుకుంది.

2024–25 సంవత్సరంలో సేవలను అందించటం, డిజిటల్‌కు మారటం, ఆర్థికంగా మళ్లీ మంచి స్థాయిలోకి రావటం వంటి అద్భుతమైన విజయాలు సాధించడం ద్వారా సామాజిక భద్రతకు సంబంధించిన సేవల విషయంలో నాయకత్వ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది.

తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈపీఎఫ్, పింఛను సేవలకు కీలకమైన కేంద్రంగా పనిచేస్తోన్న బర్కత్‌పురా కార్యాలయం 34,241 సంస్థలను పర్యవేక్షిస్తోంది.. 27.47 లక్షల ఖాతాలను నిర్వహిస్తోంది.. 6.77 లక్షల మంది క్రియాశీల చందాదారులు, 1.14 లక్షల మంది పింఛనుదారులకు సేవలందిస్తోంది.

2024–25లో సాధించిన ప్రధాన విజయాలు

ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చిన అనేక ముఖ్యమైన కార్యక్రమాలను ఈ కార్యాలయం సమర్థవంతంగా అమలు చేసింది. అవి :

* ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్లను పెంచటం: నెలకు సగటున 30,001 క్లెయిమ్‌లు ఆటోమెటిక్‌గా పరిష్కారమౌతున్నాయి. ఈ కార్యాలయం ప్రాసెసింగ్ సమయాన్ని 10 రోజుల నుంచి కేవలం 3–4 రోజులకు తీసుకొచ్చింది. దీనితో సభ్యులకు తొందరగా సేవలు అందుతున్నాయి.

* కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎస్): దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైన పింఛను తీసుకునే సేవలను ప్రారంభించింది. ఇది ఏ బ్యాంకు నుంచైనా పింఛనుదారులు ప్రయోజనాలు పొందేలా చేసింది.

* ముఖ గుర్తింపు సాంకేతిక(ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ): పింఛనుదారులు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి ఇంటి నుంచే డిజిటల్ జీవన ధ్రువీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికెట్‌) సమర్పించేందుకు వీలు కల్పించింది. ఇది భౌతిక కేంద్రాలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగించింది.

* కాగిత రహిత సేవల విషయంలో సంస్కరణలు: ఆధార్- యూఏఎన్ అనుసంధానానికి సంబంధించి నిబంధనలను అనుసరించి చెక్కులను  సమర్పించటం, ఉద్యోగం కల్పించిన సంస్థల ధ్రువీకరణ‌ను తొలగించింది. తద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతమైంది.

వీటితో పాటు నెలకు సగటున 66,379 క్లెయిమ్‌లను ఈ కార్యాలయం సెటిల్ చేసింది. నెలవారీగా 5,988 ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. వీటి ద్వారా సభ్యులకు లేవనెత్తిన అంశాలపై వేగంగా స్పందించటం, పారదర్శకతత విషయంలో తన నిబద్ధతను తెలియజేసింది.

 



కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్కరణలు మాత్రమే కాకుండా సభ్యులే కేంద్రంగా అనేక సేవలను బర్కత్‌పురా కార్యాయం అందించింది. అవి:

* మహిళా సహాయ కేంద్రం: మహిళా ఈపీఎఫ్ సభ్యులకు ప్రత్యేకమైన సహాయ వ్యవస్థ

* మరణ క్లెయిమ్‌ల విషయంలో తనిఖీ డెస్క్:  వియోగ సమయంలో వేగంగా ప్రాసెస్ చేయటం

* డిజిటల్ టచ్‌స్క్రీన్ కియోస్క్: ఈపీఎఫ్ఓలో తరచూ అడిగే ప్రశ్నలు(ఎఫ్ఓక్యూ), సమాచారంతో కూడిన వీడియోలకు అందించే వెసులుబాటు

 

 



కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మంచిచెడుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ విధులు నిర్వహిస్తోన్న తల్లిదండ్రుల పిల్లలను చూసుకునే సదుపాయాన్ని అందించింది. క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను కూడా నిర్వహించింది. ఏడాది పొడవునా స్వచ్ఛత, సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టింది. గోడలపై చిత్రాలు, శుభ్రత కార్యక్రమాలతో కార్యాలయ వాతావరణం మారిపోయింది.



2024–25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు బకాయి ఉన్న దానిలో 90 శాతాన్ని వసూలు చేసింది. ఇది ఆర్థికంగా ఈపీఎఫ్ఓ పరిస్థితిని, సభ్యులకు ప్రయోజనాల అందించటంలో గణనీయంగా దోహదపడింది.

నెలవారీ పింఛన్ల రూపంలో మొత్తం రూ. 48.41 కోట్లు.. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ బీమా(ఈడీఎల్ఐ) పథకాల కింద రూ. 153.95 కోట్లు పంపిణీ చేసింది. శ్రామిక శక్తికి ఆర్థిక భద్రత అందేలా చూడటంలో ఈ కార్యాలయం పాత్రను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రజా సేవలనందించటంలో ఈ కార్యాలయం పాటిస్తోన్న ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా భవిష్య నిధి అవార్డులు-2024లో ఉత్తమ ఫిర్యాదు నిర్వహణ కార్యాలయం విభాగంలో అవార్డు లభించింది.

ఎక్కువ వేతనాల విషయంలో పింఛనుకు(పీఓహెచ్‌డబ్ల్యూ-పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్) సంబంధించి 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటంలో బర్కత్‌పురా దేశంలోనే ముందుంది. అందిన దరఖాస్తులలో 98 శాతం(1,18,492 లో 1,17,054) ప్రాసెస్ చేసింది. దీని ద్వారా అర్హత కలిగిన సభ్యులకు సమయానుకూలంగా, సమర్థవంతంగా పింఛను ప్రయోజనాలను అందించింది.

సేవలందించే తీరును నిరంతరం మెరుగుపరించేందుకు చేపడుతోన్న కార్యక్రమాల్లో భాగంగా మరింత అందుబాటులో ఉండే, ఆధునాతర పద్ధతుల్లో సేవలను అందించేందుకు ప్రజా సేవల కేంద్రం(ఫెసిలిటేషన్ సెంటర్), పీఆర్ఓ డెస్క్‌ను పునరాభివృద్ధి చేసింది. ఈపీఎఫ్ఓ బర్కత్‌పురా పనితీరు సభ్యులందరికీ సామాజిక భద్రత పారదర్శకంగా, సాంకేతికత అధారంగా అందేలా చూసుకోవటంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను నిదర్శనంగా నిలుస్తోంది. 

 

***


(Release ID: 2136752)
Read this release in: English , Urdu , Hindi