ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖల్లో డిజిటల్ పాలన సమాచార వ్యవస్థను పటిష్ఠపరిచే లక్ష్యంతో “థింక్ సోషల్ @మై గవ్” కార్యశాలను ఏర్పాటు చేసిన మై గవ్


వివిధ మంత్రిత్వశాఖల డిజిటల్ సమాచార అధికారులు, యూట్యూబ్, మెటా సంస్థలకు చెందిన నిపుణులు హాజరు

పౌర కేంద్రీకృత పాలనా విధానాన్ని ప్రోత్సహించడంలో మై గవ్ పాత్ర కీలకంగా మారుతోందన్న సీఈఓ నంద్ కుమారం

Posted On: 13 JUN 2025 7:06PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘మై గవ్’, 2025 జూన్ 12న న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో "థింక్ సోషల్ మై గవ్ అనే ఒక రోజు కార్యశాలను విజయవంతంగా నిర్వహించిందిమంత్రిత్వశాఖలువాటి విభాగాల్లో డిజిటల్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం…  యూట్యూబ్మెటాలింక్డ్ ఇన్ వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి పెట్టిందిసమ్మిళితమైన అనుసంధానం ద్వారా జనభాగిదారిని సాధించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

ఎన్ఈజీడీ అధ్యక్ష సీఈఓ .. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్.. మై గవ్ సీఈఓ శ్రీ నంద్ కుమారమ్,  మై గవ్ డైరెక్టర్ శ్రీ శోభేంద్ర బహదూర్మై గవ్ సీనియర్ అధికారుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైందినంద్ కుమారం తమ ప్రసంగంలో మై గవ్  డిజిటల్ ప్రయాణం గురించి తెలియజేశారుపౌర కేంద్రీకృత పాలనా విధానాన్ని ప్రోత్సహించడంలో మై గవ్ పాత్ర కీలకంగా మారుతోందని అభిప్రాయపడ్డారుయువతతో అనుసంధానంపాలనాపరమైన కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారుప్రజా భాగస్వామ్యాన్నిపారదర్శకతను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంలో తోడ్పడ్డ ముఖ్య ప్రచారాలను గురించి తెలియజేశారుగౌరవ ప్రధానమంత్రి జనభాగిదారి దార్శనికతకు అనుగుణంగాప్రభావవంతమైన విధాన రూపకల్పనసమ్మిళిత అనుసంధానాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను మరింత సమర్థంగా వినియోగించుకునే పద్ధతుల గురించిన అభిప్రాయాలను పంచుకున్నారు.

మై గవ్ 11 ఏళ్ళ ప్రయాణంప్రధాన ప్రభుత్వ ప్రచారాల్లోపౌరుల భాగస్వామ్యంలో పెరుగుతున్న మై గవ్ పాత్ర గురించి శ్రీ శోభేంద్ర బహదూర్ వివరించారుమంత్రిత్వశాఖలువాటి విభాగాల్లో డిజిటల్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం…  యూట్యూబ్మెటాలింక్డ్ ఇన్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై వర్క్‌షాప్ దృష్టి పెట్టింది.

ఈ వర్క్‌షాప్‌లో వివిధ మంత్రిత్వశాఖలువిభాగాలకు చెందిన డిజిటల్ కమ్యూనికేషన్ నిపుణులు పాల్గొన్నారుసీనియర్ మై గవ్ అధికారుల సహకారంతో యూట్యూబ్మెటా సంస్థలకు చెందిన నిపుణులు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారుఈ సెషన్లలో వ్యూహాత్మక కంటెంట్ అభివృద్ధిప్లాట్‌ఫారమ్ ఇంటెలిజెన్స్ప్రేక్షకుల భాగస్వామ్య పెంపు పద్ధతులపై దృష్టి సారించారు.

 సోషల్ మీడియాకు చెందిన ఈ క్రింది అంశాలపై ఈ వర్క్‌షాప్ దృష్టి పెట్టింది:

  • వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంవారి భాగస్వామ్యం పెంపువారికి అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉంచేందుకు చేపట్టవలసిన పద్ధతులు.

  • గూగుల్ ట్రెండ్స్ వంటి విశ్లేషణ సాధనాల వినియోగం.

  • రీల్స్ స్టోరీస్ వంటి విజువల్ కంటెంట్ ఫార్మాట్‌లు.

  •  ప్రేక్షకుల ఇష్టానిష్టాలుటార్గెటెడ్ కంటెంట్‌ను ఆకళింపు చేసుకోవడం.

  • వాట్సప్ ఏపీఐథ్రెడ్‌లుమెటా ఏఐలపై చర్చలు.

ప్రభుత్వ కీలక విధానాలుకార్యక్రమాలుపథకాల విస్తరణ కోసం సోషల్ మీడియా వాడకం గురించి డొమైన్ నిపుణులు  తమ అభిప్రాయాలని పంచుకున్నారు:

  1. గరిమా తివారీ - మై గవ్ ప్రధాన కార్యక్రమాలుకీలక విజయాలుస్పష్టమైన ఫలితాల వ్యూహాత్మక సమీక్షను అందించారు.

    ఆశిష్ ఖరే వినూత్న కంటెంట్ సృష్టిబహుళ-ప్లాట్‌ఫారమ్ పంపిణీ ఫ్రేమ్‌వర్క్‌లుప్రభుత్వ సందేశాలను అందించేందుకు అనువైన డిజిటల్ కథన రీతులను మెరుగుపరచడంపై ఒక సెషన్‌ను నిర్వహించారు

    ఉపేంద్ర ఉపాధ్యాయ డిజిటల్ ప్రచారాలలో పక్కా సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంఉత్తమమైన పనితీరు కోసం డేటా ఎనలటిక్స్ వినియోగం గురించి ప్రసంగించారు.

    రేణు సింగ్ – వ్యూహాత్మక అనుసంధానంవివిధ ఏజెన్సీల మధ్య భాగస్వామ్యాలుఅధిక-ప్రభావాన్ని చూపిన జాతీయ ప్రచారాల గురించి ఉదాహరణాలతో లోతైన విశ్లేషణ చేశారు.

వర్క్‌షాప్ సందర్భంగా ఈ కింది ప్రచారాలు, వ్యూహాత్మక కేస్ స్టడీస్ సహా అనేక అంశాల గురించి చర్చించారు:

  • పరీక్ష పే చర్చ 2025 – 3 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం అపూర్వమైన పౌర భాగస్వామ్యాన్ని సాధించింది భాగస్వామ్య పాలన భావనకు బలోపేతం చేసింది.

  • జాతీయ క్రియేటర్స్ అవార్డులు – 1.5 లక్షల నామినేషన్లను సొంతం చేసుకుని 6,000 మంది  ప్రత్యక్ష భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ప్రజా భాగస్వామ్యాన్ని సుసాధ్యం చేసింది.

  • చంద్రయాన్-మహా క్విజ్ – ఈ జాతీయ విజ్ఞాన ప్రచారోద్యమం టాప్-100 విజేతలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర సందర్శన అపూర్వ అవకాశాన్ని కల్పించింది.  

  • క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ – నిర్మాణాత్మక విద్యా కార్యక్రమాల ద్వారా యువతను పాలనలో చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దే కార్యక్రమం.

  • జీడీపీ పాడ్‌కాస్ట్రోర్ ఫర్ నేచర్ – కీలక విధానాలువాతావరణంపర్యావరణహిత ఇతివృత్తాలపై యువతకు అవగాహన కల్పించేందుకుప్రేరణ కలిగించేందుకు రూపొందించిన  వ్యూహాత్మక కార్యక్రమాలు.

  • కోవిడ్-19 సమయంలో మై గవ్ వాట్సప్ సేవలు – టీకా సర్టిఫికెట్లునిర్ధారించిన సమాచారాన్ని  పౌరులకు సులభంగా అందించడంలో దోహదపడ్డాయి.

  • ఆపరేషన్ సిందూర్ – తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టి,  ధృవీకరించిన ప్రభుత్వ సమాచారాన్ని తక్షణమే ప్రజలకు చెరవేసిన విధానానికి మచ్చుతునకగా నిలిచింది.

  • మై గవ్  స్ట్రీమ్ – పౌర-కేంద్రీకృతపాలన-సంబంధిత కంటెంట్‌ను భద్రపరిచేందుకు అంకితమైన ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్.

  • డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విశ్వసనీయ కంటెంట్కథనం-ఆధారిత కమ్యూనికేషన్వివిధ డిజిటల్ వేదికలపై ప్రేక్షకులకు అనువైన కంటెంట్ లభ్యతకు ప్రాముఖ్యం.

  • పారదర్శకతజవాబుదారీతనంఅంశాల ప్రభావాలను తెలుసుకునేందుకు డేటా-ఆధారిత కమ్యూనికేషన్ నమూనాల వినియోగం.

పాలనలో తెలివైనడేటా ఆధారిత కమ్యూనికేషన్‌ను రూపొందించడంలో “థింక్ సోషల్ మైగవ్” కార్యశాల  ఒక ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిందినిపుణులువ్యూహకర్తలుడిజిటల్ రంగ ప్రముఖులను ఒక చోటకు  చేర్చడం ద్వారాడిజిటల్ యుగంలో పారదర్శకసమ్మిళితపౌర-కేంద్రీకృత భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మైగవ్  నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేసింది.

 

***


(Release ID: 2136303)
Read this release in: English , Urdu , Marathi , Hindi