భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

చట్టపరమైన విధాన బలోపేతం, మెరుగైన దిశానిర్దేశం కోసం న్యాయవాదులు, సీఈఓలతో జాతీయ సదస్సు నిర్వహించిన ఈసీఐ

प्रविष्टि तिथि: 24 MAY 2025 8:49PM by PIB Hyderabad

భారత ఎన్నికల కమిషన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో న్యూఢిల్లీలోని ఐఐఐడీఈఎమ్‌లో నిర్వహించిన జాతీయ సదస్సును ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధుడాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రారంభించారుభారత సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా గల 28 హైకోర్టుల నుంచి సీనియర్ న్యాయవాదులుఅధికారులుఅన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 36 మంది సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారుసమన్వయం సాధించడం ద్వారా కొత్త సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధానాన్ని బలోపేతం చేస్తూమెరుగైన దిశానిర్దేశం చేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారుపరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో వ్యవహరించేందుకూ, సమస్యల్ని వినితగినన్ని అవకాశాలను అందించడం గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

రోజంతా జరిగిన ఈ సమావేశం ఎన్నికల కమిషన్ ప్రముఖ న్యాయ నిపుణుల మధ్య నిర్మాణాత్మక చర్చలకుపరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి చక్కని వేదికగా నిలిచిందిఅందుబాటులో గల చట్టపరమైన వనరులను దేశంలో నిరంతరం మెరుగవుతున్న ఎన్నికల వ్యవస్థను న్యాయశాస్త్రానికి అనుగుణంగా ఉండేలా చేసేందుకు ఎన్నికల కమిషన్ వేసిన కీలక ముందడుగును ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సూచిస్తుందిఎన్నికల చట్టంన్యాయపరమైన చర్యలుచట్టపరమైన సంస్కరణలకు సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూసంసిద్ధతసామర్థ్యంసమన్వయాన్ని మెరుగుపరచడంపై ఈ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయిఈ సదస్సు నిర్వహణ ద్వారావివిధ న్యాయ వేదికలలో తమ చట్టపరమైన ప్రాతినిధ్య ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నించింది.

ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని ఐఐఐడీఈఎమ్‌లో శుక్రవారం ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించిందిఈసీఐ చేపట్టే ఐటీ వినియోగం కోసం ప్రణాళికను రూపొందించడందానిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందిఈసీఐ సంబంధిత వ్యక్తులందరి కోసం.. అవసరమైన చట్టపరమైన నిబంధనల పరిధిలోసంబంధిత డేటా మొత్తం ఒకే వేదిక ద్వారా అందుబాటులో ఉంచే లక్ష్యంతో కమిషన్ ఇప్పటికే 2025లోనే ఈసీఐఎన్ఈటీ అనే ఇంటిగ్రేటెడ్ డాష్‌బోర్డుని రూపొందించడానికిఅభివృద్ధి చేయడానికి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిందిఈ ప్రత్యేక ప్రయత్నం ద్వారా ఈసీఐ తన ఐసీటీ వినియోగాలన్నింటినీ ఒకే గొడుగు కింద ఏకీకృతం చేయనుంది.

 

***


(रिलीज़ आईडी: 2131123) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी