పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని కోటా, ఒడిశాలోని పూరీలో విమానాశ్రయాల నిర్మాణానికి


కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు సూత్రప్రాయ ఆమోదం

Posted On: 05 MAY 2025 9:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ దేశ ప్రజలకు వాయు మార్గ సంధానాన్ని పటిష్ఠపరచడానికి కట్టుబడి ఉందిఈ దిశగా మరో అడుగు వేస్తూరాజస్థాన్‌లో కోటాఒడిశాలో పూరీ నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు పౌర విమానయానశాఖ మంత్రి శ్రీ రామ్మోహన్‌నాయుడు కింజరాపు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేశారు.

కోటాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉందిలోక్‌సభ స్పీకరుకోటా-బూందీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఓమ్ బిర్లా తీవ్ర ప్రయత్నాలతో ఇది సిద్ధించిందిపౌర విమానయానశాఖతో సంప్రదింపుల ఫలితంగా దీనికి త్వరిత గతిన ఆమోదం లభించింది.
ప్రతిపాదిత విమానాశ్రయం విద్యపారిశ్రామిక కూడలిగా ఉన్న కోటా నగరానికి సేవలను అందించడం ఒక్కటే కాకుండాజనాభాతోపాటే ఆర్థిక కార్యకలాపాలు కూడా వృద్ధి చెందుతున్న హాడౌతీ ప్రాంతం అవసరాల్ని కూడా తీరుస్తుందిఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తేదేశ స్థాయిలోఅంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాన గమ్యస్థానంగా కోటా మారుతుంది.

ఈ నిర్ణయం రాజస్థాన్‌లోని కోటాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఓ ప్రధాన ఘట్టానికి నాందీ ప్రస్తావనే కాకుండావిమాన యానాన్ని మన దేశంలో ప్రతి ఒక్కరి అందుబాటులోకీ తీసుకు రావాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా కూడా ఉంది.
పూరీ మన దేశంలో అత్యంత తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిపూరీ జగన్నాథుడు కొలువైన క్షేత్రందేశం నలుమూలల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది భక్తులు పూరీకి తరలివస్తారుపూరీలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ధార్మిక పర్యటనకూప్రాంతీయ అభివృద్ధికీఈ ప్రాంత సమగ్ర అనుసంధానానికీ ఉపయోగపడుతుంది.
ఈ విమానాశ్రయం పూరీకిదేశంలో ప్రధాన మహానగరాలకు మధ్య నేరుగా అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుందిఈ నిర్ణయం పూరీతోపాటు ఒడిశాకూ ఒక మహత్తర ఘట్టమేఇది వాయు మార్గ సంధానాన్ని విస్తరిస్తూ పోవాలన్నవిమాన ప్రయాణాన్ని అందరి అందుబాటులోకి తీసుకు రావాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంది.‌‌

 

**‌*


(Release ID: 2127225) Visitor Counter : 14
Read this release in: English , Urdu , Hindi , Bengali , Odia