ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
22 MAR 2025 9:06AM by PIB Hyderabad
బీహార్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ సుసంపన్న వారసత్వాన్ని,
దేశ చరిత్రలో రాష్ట్రానికిగల ఉన్నత స్థానాన్ని, రాష్ట్ర ప్రగతికి
తోడ్పాటులో అక్కడి ప్రజల నిర్విరామ స్ఫూర్తిని ఈ సందర్భంగా ఆయన
ప్రశంసించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బీహార్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఎందరో మహనీయులు, వీరులకు
జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమి నివాసులైన సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక
శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రకు గర్వకారణమైన బీహార్ రాష్ట్రం నేడు
పురోగమన పథంలో కీలక ప్రయాణం సాగిస్తోంది. అందువల్ల కష్టజీవులు,
ప్రతిభావంతులైన ప్రజలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఈ సమయంలో
మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మ వంటి ఈ రాష్ట్ర
సర్వతోముఖాభివృద్ధికి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ శాయశక్తులా
కృషిచేద్దాం” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
(Release ID: 2113959)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam