చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుప్రీంకోర్టు కేసుల నిర్వహణలో ఏఐ వినియోగం

Posted On: 20 MAR 2025 3:24PM by PIB Hyderabad

కేసుల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్ఆధారిత సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించిందిరాజ్యాంగ ధర్మాసనం ఎదుట జరిగే మౌఖిక వాదనలను అక్షరబద్ధం చేసేందుకు ఆయా సాంకేతిక సాధనాలను వినియోగిస్తున్నట్లు వివరించిందిసుప్రీంకోర్టు వెబ్ సైటు నుంచి ఏఐ లిప్యంతరీకరణ వాదనలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపిందిసాధారణ విచారణ కోసం కేటాయించిన గురువారం నాటి మౌఖిక వాదనల లిప్యంతరీకరణ అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారి సూచించారు.

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీసహకారంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా ఏఐఎంఎల్ ఉపకరణాలను వినియోగిస్తోందితీర్పులను 18 భారతీయ భాషలైన అస్సామీబెంగాలీగారోగుజరాతీహిందీకన్నడకాశ్మీరీఖాసీకొంకణిమలయాళంమరాఠీనేపాలీఒడియాపంజాబీసంథాలితమిళంతెలుగుఉర్దూల్లోకి తర్జుమా చేసేందుకు వినియోగిస్తున్నారుసుప్రీంకోర్టు  అధికారిక వెబ్ సైటు ఈ-ఎస్ సీఆర్ (eSCRపోర్టల్ ద్వారా తీర్పులను చూడవచ్చు.

ఐఐటీ మద్రాస్ సహకారంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ... అభివృద్ధి పరచివినియోగిస్తున్న ఏఐఎంఎల్ సాధనాలను రిజిస్ట్రీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సాంకేతికతో సమన్వయం చేసి లోపాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారున్యాయహక్కున్యాయ నిర్వహణ హక్కులను బలపరిచేందుకు ఇటీవలే ఈ నమూనాను 200  ‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్’ లకు అందుబాటులోకి తెచ్చారువీరు నూతన సాంకేతికతను వినియోగించి తమ అనుభవాలను పంచుకుంటారు.

డేటా లోపాల సవరణమెటా డేటా సేకరణ కోసం ఐఐటీ మద్రాసు సహాయంతో ఏఐఎంఎల్ నమూనాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరీక్షిస్తోందిఏఐఎంఎల్ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి పరిచే ఈ ఉపకరణాన్ని ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐసీఎంఐఎస్పేరిట గల ఎలక్ట్రానిక్ ఫైలింగ్ మాడ్యూల్కేసుల నిర్వహణ సాఫ్ట్ వేర్  లతో అనుసంధానిస్తారు.   

న్యాయ నిర్ణయంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఏఐఎంఎల్ ఆధారిత సాంకేతికతలను వినియోగించడం లేదు.

కేసుల గుర్తింపుచేపట్టిన కేసు పట్ల సంపూర్ణ అవగాహనసంబంధిత పూర్వాపరాల పరిశీలన నిమిత్తం నైపుణ్య ఆధారిత అన్వేషణ కోసం సుప్రీంకోర్ట్ పోర్టల్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియెన్సీ (ఎస్యూపీఏసీఈ-సుపేస్పేరిట అభివృద్ధిపరుస్తున్న కృత్రిమ మేధ ఆధారిత సాధనం ప్రయోగాత్మక దశలో ఉంది.  గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఇతర తాజా సాంకేతిక-ఆధారిత యూనిట్ల సేకరణ అనంతరం సుపేస్ ను వినియోగంలోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.  

కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రిపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభకు ఈ రోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించారు.  

 

****


(Release ID: 2113474) Visitor Counter : 27