ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ భేటీ
Posted On:
13 FEB 2025 11:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ ఈ రోజు సమావేశమయ్యారు.
భారత్- అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు కొనసాగాయి. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారం, పౌర అణుశక్తిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లకు ప్రాధాన్యం, ఉగ్రవాద నిరోధక కార్యాకలాపాలు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరిగింది.
పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు.
(Release ID: 2103166)
Visitor Counter : 34