వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపగ్రహం ద్వారా పంట నష్టం అంచనా

Posted On: 11 FEB 2025 5:23PM by PIB Hyderabad

మహలనోబిస్ జాతీయ సస్య సూచన కేంద్రం (ఎంఎన్ సీఎఫ్సీద్వారా వివిధ ప్రభుత్వప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేయడం ద్వారా రిమోట్ సెన్సింగ్ సమాచారం (ఉపగ్రహసహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద సకాలంలోపారదర్శకంగా దిగుబడిని అంచనా వేయడం కోసం వ్యవసాయరైతు సంక్షేమ శాఖ ప్రయోగాత్మక అధ్యయనాలు నిర్వహించిందివీటి ఆధారంగా.. భాగస్వాములతో చర్చలుసాంకేతికపరమైన సంప్రదింపుల అనంతరం 2023 ఖరీఫ్ నుంచి వరిగోధుమ పంటల కోసం ఎస్-టెక్ (సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ)ను ప్రవేశపెట్టారుపంట నష్టం అంచనాను మెరుగుపరచడానికిరైతులకు సకాలంలో బీమా క్లయిముల చెల్లింపులను అందించడం కోసం.. సాంప్రదాయక పంట కోత ప్రయోగాల (సీసీఈ)తో కలిసి సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనాను ప్రభుత్వం అమలు చేసిందిదిగుబడి అంచనాలో ఎస్-టెక్ ద్వారా పొందిన సమాచారానికి ఈ కార్యక్రమం ద్వారా 30% వెయిటేజీ కేటాయింపును తప్పనిసరి చేశారు

దీనిని అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాలు 2023 ఖరీఫ్ లో ఎస్ టెక్ ను ఉపయోగించి క్లయిముల లెక్కింపుచెల్లింపును విజయవంతంగా పూర్తిచేశాయిఇందులో భాగస్వాములైన వారెవరూ ఎలాంటి వివాదాన్నీ లేవనెత్తలేదుదీంతో వ్యవస్థలో పారదర్శకతసమర్థత పెరిగింది.

ప్రధానమంత్ర ఫసల్ బీమా యోజన ప్రధానంగా ‘విస్తీర్ణ ఆధారిత’ ప్రాతిపదికన అమలవుతుందివిత్తక ముందు నుంచి పంట కోత అనంతర దశ వరకు.. అనివార్యమైన అన్ని ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు కలిగే పంట నష్టాలు సమగ్రంగా దీని పరిధిలోకి వస్తాయిఈ పథకం కింద రైతులు అతి స్వల్ప ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందిఅయితే వడగండ్ల వానకొండ చరియలు విరిగిపడడంముంపుక్లౌడ్ బరస్ట్అడవుల్లో మంటల వంటి స్థానిక కారణాల వల్ల నష్టాలపాటు.. తుఫానుఅకాల వర్షాలువడగండ్ల వానల వంటి పంట కోత అనంతర నష్టాలను వ్యక్తిగతంగా బీమా చేసిన వ్యవసాయ క్షేత్ర ప్రాతిపదికన లెక్కిస్తారు.

ఏజెన్సీలు కొనుగోలు చేయకపోవడం లేదా వాటి ద్వారా సేకరణలో జాప్యం వల్ల పంటలకు కలిగే నష్టం ఫసల్ బీమా యోజన పరిధిలోకి రాదు.

పంటల బీమా పథకాల్లో సమీక్షసవరణలుహేతుబద్ధీకరణమెరుగుదల నిరంతర ప్రక్రియభాగస్వాములఅధ్యయనాల ద్వారా సలహాలువిజ్ఞప్తులుసిఫార్సులను ఎప్పటికప్పుడు స్వీకరిస్తారు. వీటి ద్వారా పొందిన అనుభవంవివిధ భాగస్వాముల అభిప్రాయాల ఆధారంగా.. పారదర్శకతజవాబుదారీతనాలను మెరుగుపరచడంతోపాటు రైతులకు సకాలంలో ్లయిములను చెల్లించిఈ పథకాన్ని రైతులకు మరింత అనువైనదిగా మార్చడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమగ్రంగా సవరించింది. తద్వారా ఈ పథకం ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు రైతులకు సకాలంలోపారదర్శకంగా అందేలా చూస్తోంది.

వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు

 

***

 


(Release ID: 2102776) Visitor Counter : 16


Read this release in: English , Urdu , Hindi