వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు

Posted On: 07 FEB 2025 5:05PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయంరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారుఆంధ్రప్రదేశ్‌లోని మిరప రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారువ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారుఅనంతరం మీడియాతో శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎర్ర మిరపను సేకరించాలని యోచిస్తోందనివివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారుఈ విషయంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారని వివరించారు.

మిరప రైతుల సమస్యలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రాసిన లేఖను శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అందజేసినట్లు శ్రీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.


(Release ID: 2100880)
Read this release in: English , Urdu , Hindi