రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ .6,798 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం


అయిదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల మరింత అనుసంధానం; ప్రయాణ సౌలభ్యం; తగ్గనున్న - రవాణా ఖర్చులు, చమురు దిగుమతులు, కార్బన్ ఉద్గారాలు

ఈ కొత్త ప్రాజెక్టులతో రైలు సదుపాయం లేని ప్రాంతాల అనుసంధానం: ఇప్పటికే ఉన్న రైలు మార్గాల సామర్ధ్యం పెంపు; రవాణా వ్యవస్థల పటిష్ఠం; ఫలితంగా సరఫరా మార్గాల క్రమబద్ధీకరణ;

ఈ ప్రాజెక్టుల ద్వారా 106 లక్షల పని దినాలపాటు ప్రత్యక్ష ఉపాధి.

Posted On: 24 OCT 2024 3:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎసుమారు రూ.6,798 కోట్ల అంచనాలతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది

ఆమోదించిన ప్రాజెక్టులలో () 256 కిలోమీటర్ల నార్కటియాగంజ్రక్సౌల్-సీతామర్హి-దర్భాంగాసీతామర్హి-ముజఫర్పూర్ సెక్షన్ డబ్లింగ్బిఅమరావతి మీదుగా ఎర్రుపాలెంనంబూరు మధ్య 57 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఉన్నాయి

నార్కటియాగంజ్-రక్సౌల్-సీతామర్హి-దర్భంగాసీతామర్హి-ముజఫర్పూర్ సెక్షన్ ను డబ్లింగ్ చేయడం వల్ల నేపాల్భారత్ లోని ఈశాన్య భారతంతోపాటుసరిహద్దు ప్రాంతాలకు కనెక్టివిటీ బలోపేతం అవుతుందిగూడ్స్ రైళ్లతో రైలుతో పాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకల ఫలితంగా ఈ ప్రాంతం సామాజికంగానూఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుంది.

ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త రైలు మార్గం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ విజయవాడగుంటూరు జిల్లాలుతెలంగాణలోని ఖమ్మం జిల్లాను కలుపుతుంది.

ఆంధ్రప్రదేశ్తెలంగాణబీహార్ రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేసే ఈ రెండు ప్రాజెక్టులు ప్రస్తుత రైలు మార్గాల వ్యవస్థను సుమారు 313 కిలోమీటర్లు పెంచుతాయి.

కొత్త రైలు మార్గం కొత్త స్టేషన్లతో సుమారు 168 గ్రామాలకుసుమారు 12 లక్షల జనాభాకు అనుసంధానాన్ని అందిస్తుందిమల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టురెండు ఆకాంక్షిత జిల్లాలైన సితామర్హి ముజఫర్‌పూర్లకు అనుసంధానతను మెరుగుపరుస్తుందిఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 388 గ్రామాలుదాదాపు సుమారు లక్షల మంది జనాభాకు సేవలు అందుతాయి.

వ్యవసాయ ఉత్పత్తులుఎరువులుబొగ్గుఇనుప ఖనిజంఉక్కుసిమెంట్ మొదలైన వాటి రవాణాకు ఇవి అవసరమైన మార్గాలుసామర్థ్యాన్ని పెంచే పనుల వల్ల 31 ఎంటిపిఎ (ఏడాదికి మిలియన్ టన్నులుఅదనపు సరుకు రవాణా జరుగుతుందిపర్యావరణ అనుకూలంగాసమర్థవంతమైన ఇంధన రవాణాతో పర్యావరణపరమైన లక్ష్యాలను సాధించడానికి,  దేశ రవాణా వ్యయాన్ని తగ్గించడానికి దోహదపడుతోందిసుమారు 168 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోందిఇది కోట్ల చెట్ల పెంపకానికి సమానం.

కొత్త రైల్వే మార్గం ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుందిపరిశ్రమలు జనాభాకు రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందిభారతీయ రైల్వేలకు మరింత సామర్ధ్యాన్నిసేవ పరంగా విశ్వసనీయతను అందిస్తుందిమల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన వల్ల కార్యకలాపాలు సులభతరం అవుతాయిరద్దీ తగ్గుతుందిభారతీయ రైల్వే అంతటా రద్దీగా ఉండే విభాగాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది

ప్రధానమంత్రి ‘నవ భారత’ దార్శనికతకు అనుగుణంగా ఉన్న ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధిస్వయంఉపాధి అవకాశాలను పెంచి  "ఆత్మనిర్భర్గా మార్చనున్నాయి

ఈ ప్రాజెక్టులు బహుళ-నమూనా కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫలితంగా రూపుదిద్దుకున్నాయిసమగ్ర ప్రణాళిక ద్వారా సాధ్యమయిన ఈ ప్రాజెక్టులు ప్రజలువస్తువులుసేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానాన్ని అందిస్తాయి.

 

***




(Release ID: 2067918) Visitor Counter : 20