మంత్రిమండలి
azadi ka amrit mahotsav g20-india-2023

రైల్వే సిబ్బందికి 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం

Posted On: 03 OCT 2024 8:34PM by PIB Hyderabad

రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా 11,72,240 మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన రూ. 2028.57 కోట్లను బోనస్ (పిఎల్బీ)గా చెల్లించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ట్రాక్ నిర్వాహకులులోకో పైలట్లుట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లుసూపర్వైజర్లుటెక్నీషియన్లుటెక్నీషియన్ హెల్పర్లుపాయింట్స్ మెన్మినిస్టీరియల్ స్టాఫ్ఇతర గ్రూప్-ఎక్స్ సి వంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.  రైల్వే ఉద్యోగులను ఉత్సాహపరచడానికీరైల్వేల పనితీరు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయడానికి ఈ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.

అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దుర్గాపూజ దసరా సెలవులకు ముందు బోనస్ చెల్లిస్తారుఈ ఏడాది కూడా 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

అర్హత కలిగిన ప్రతి  రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గాను చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ట్రాక్ నిర్వాహకులులోకో పైలట్లుట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లుసూపర్వైజర్లుటెక్నీషియన్లుటెక్నీషియన్ హెల్పర్లుపాయింట్స్ మెన్మినిస్టీరియల్ స్టాఫ్ఇతర గ్రూప్ ఎక్స్ సీవంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ చెల్లింపు ఉంటుంది.

2023-2024 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుందిరైల్వేలు రికార్డు స్థాయిలో 1588 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయిదాదాపు 6.7 బిలియన్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

ఈ రికార్డు పని తీరుకు అనేక అంశాలు దోహదం చేశాయిరైల్వేలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులను పెట్టడం ద్వారా మౌలిక సదుపాయాల మెరుగుదలకార్యకలాపాల్లో సమర్థతమెరుగైన సాంకేతికత మొదలైనవి కూడా ఇందుకు దోహదపడ్డాయి.

 

***



(Release ID: 2061783) Visitor Counter : 43