రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మందుగుండు సామాను మరియు ఇతర సరఫరాల ను తీసుకు పోయే ఆరోక్షిపణి యుక్త నావ ఎల్ఎస్ఎఎమ్ 20 (యార్డ్ 130) ను అప్పగించడమైంది

Posted On: 29 MAY 2024 9:20PM by PIB Hyderabad

భారతీయ నావికా దళం కోసం ఠాణె లోని ఎమ్ఎస్ఎమ్ఇశిప్ యార్డ్ కు చెందిన మెసర్స్ సూర్యదీప్త ప్రాజెక్ట్ స్ ప్రైవేట్ లిమిటెడ్, ఠాణేవారు నిర్మించినటువంటి 11 x ఎసిటిసిఎమ్ లాజిస్టిక్స్ శిప్ ప్రాజెక్టు లో భాగం గా ‘మందుగుండు సామాను మరియు ఇతర సరఫరాల ను తీసుకు పోయేటటువంటి క్షిపణి యుక్త నావ, ఎల్ఎస్ఎఎమ్ 20’ ఆరో నావ ను ఎన్ఎడి  (కరంజ) కోసమని 2024 మే నెల 29 వ తేదీ నాడుముంబయి నౌకాదళ డాక్ యార్డు లో అప్పగించడమైంది.  ప్రవేశకార్యక్రమానికి కమాండర్ నాదెళ్ళ రమణ, జిఎమ్ఆర్, ఎన్‌డి (ఎమ్‌బిఐ) అధ్యక్షత వహించారు.   11 x ఎసిటిసిఎమ్ నౌకల ను నిర్మించడం కోసం రక్షణ మంత్రిత్వశాఖ కు మరియు మెసర్స్ సూర్యదీప్త ప్రాజెక్ట్ స్ ప్రైవేట్ లిమిటెడ్, ఠాణె కు మధ్య 2021 మార్చి నెల 5 వ తేదీ న ఒక కాంట్రాక్టు పై సంతకాలు అయ్యాయి. ఈ నావ లు భారతీయ నౌకాశ్రయాలు మరియుఅవుటర్ హార్బర్ లలో నావ ల వద్ద కు మందుగుండు ను / సరఫరాల ను చేరవేసే మరియు ఆసరఫరాల ను దించివేసే సౌకర్యాన్ని సమకూర్చి భారతీయ నౌకాదళం యొక్క నిర్వహణ సంబంధి కర్తవ్యాలను ప్రోత్సహించనున్నాయి. ఈ నావల ను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ శిపింగు కు చెందిన సందర్భశుద్ధిగల నియమ నిబంధనల లో భాగం గా దేశీయ డిజైన్ తో నిర్మించడమైంది.  డిజైన్ దశ లో, నావ యొక్క మూలరూపం సంబంధి పరీక్ష ను న్ని విశాఖపట్నంలోని నౌకా దళ విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక ప్రయోగశాల లో నిర్వహించడమైంది.  ఈ నావ లు భారతప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం శోభ ను పెంచుతున్నాయి.  
 

 

***
 



(Release ID: 2022235) Visitor Counter : 70


Read this release in: English , Urdu , Tamil