పర్యటక మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అలలపై లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
పర్యాటక ఆకర్షణలు మెరుగుపరచడం, అధునాతన ఆడియో-విజువల్ టెక్నాలజీ ద్వారా ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా ప్రాజెక్టు ఏర్పాటు
Posted On:
12 MAR 2024 8:50PM by PIB Hyderabad
హుస్సేన్ సాగర్ అలలపై వాటర్ స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెన్తో కూడిన ప్రత్యేకమైన లేజర్ ఆధారిత లైట్ అండ్ సౌండ్ షో 'ది కోహినూర్ స్టోరీ' ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు 2024 మార్చి 12, న ప్రారంభించారు. ప్రజలు ప్రదర్శనలు చూసేందుకు వీలుగా సంజీవయ్య పార్క్ వద్ద. నిర్మించిన మల్టీపర్పస్ గ్యాలరీ ని కూడా మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రస్తుతం ఉన్న పర్యాటక ఆకర్షణలతో పాటు 'ది కోహినూర్ స్టోరీ' మరో ఆకర్షణగా ఉంటుంది. తెలంగాణ నెల నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వజ్రం గా గుర్తింపు పొందిన 'కోహినూర్' కథను లైట్ అండ్ సౌండ్ షో వర్ణిస్తుంది, . కోహినూర్ పుట్టుక, సంస్కృతులు, ఖండాలలో దాని ప్రయాణం ఒక ఆసక్తికరమైన కథ. వివిధ కారణాల వల్ల ఈ కథనం ప్రభావవంతంగా ప్రజలకు చేరలేదు. కోహినూర్ కథను వెలుగులోకి తీసుకురావడానికి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. స్క్రిప్టును రాజ్యసభ సభ్యులు శ్రీ ఎస్.విజయేంద్రప్రసాద్ పర్యవేక్షణలో శ్రీ ఎస్.ఎస్.కంచి రూపొందించారు.
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో లైట్ అండ్ సౌండ్ షో లు జరుగుతున్నాయి. అయితే సరస్సు అలలపై లైట్ అండ్ సౌండ్ షో ప్రదర్శన ఒక కొత్త ప్రయోగం. సరస్సుపై ఏర్పాటు చేసిన ఫౌంటైన్ల శ్రేణి హుస్సేన్ సాగర్ ను ఒక స్క్రీన్గా మార్చి కోహినూర్ కథను, కోహినూర్ ద్వారా తెలంగాణ కథను, దేశ సాంస్కృతిక, నాగరికత వారసత్వాన్ని అందించే రంగుల వీడియో చిత్రాన్ని ప్రదర్శిస్తుంది.
సమకాలీన ప్రాంత చరిత్రను నేపధ్య సంగీతంతో ఆడియో-విజువల్ మీడియా సహాయంతో ఫౌంటెన్ షో ద్వారా రూపొందిన ఈ సృజనాత్మక ప్రదర్శన పర్యాటక ఆకర్షణలగా ఉంటుంది. కలిగి ఉండాలని ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కూర్చుని స్ ప్రదర్శన తిలకించడానికి పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు అవసరమైన నడక మార్గాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు.
ప్రముఖ గాయని శ్రీమతి. సునీత కథ అందించగా, శ్రీ వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు.
ప్రాజెక్ట్ ముఖ్యమైన అంశాలు:
1. ప్రాజెక్ట్ పేరు , ప్రాంతం : సంజీవయ్య పార్క్లో వాటర్ స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెన్ ఇంటిగ్రేటెడ్ లైట్స్ అండ్ ప్రొజెక్షన్ షో తో కూడిన మల్టీమీడియా లేజర్ షో రూపకల్పన, సరఫరా, ఏర్పాటు, పరీక్ష,నిర్వహణ
2. రోబోటిక్ నాజిల్లు, లైటింగ్: 16 మిలియన్లకు పైగా ఎంపికలతో ఆకర్షణీయ రంగు మార్పుల కోసం DMX విధానాన్ని ఉపయోగించి అధునాతన నీటి అడుగున లైటింగ్ సిస్టమ్తో 1000 కంటే ఎక్కువ రోబోటిక్ నాజిల్లు ఏర్పాటు.
3. లేజర్ టెక్నాలజీ: దృశ్యమాన అనుభవాన్ని మెరుగుపరచడానికి మూడు 40W RGB లేజర్ల ఏర్పాటు.
4. సందర్శకుల కోసం గ్యాలరీ,రూఫ్టాప్ రెస్టారెంట్: సంజీవయ్య పార్క్లో ఏర్పాటు చేసిన మల్టీమీడియా షో విస్తృత దృశ్యాలను తిలకించడానికి వీలుగా రూఫ్టాప్ రెస్టారెంట్తో పాటు 800-1000 మంది కూర్చోవడానికి వీలుగా గ్యాలరీ నిర్మాణం
5. మీడియా సర్వర్ , రంగు పరివర్తనాలు: వేగవంతమైన, సమర్థవంతమైన రంగు పరివర్తనం కోసం శక్తివంతమైన మీడియా సర్వర్
6. హై-డెఫినిషన్ ప్రొజెక్షన్: ఆక్వా స్క్రీన్పై స్పష్టమైన, శక్తివంతమైన అంచనాల కోసం ఒక్కొక్కటి 34,000 ల్యూమెన్లు కలిగిన మూడు హై-డెఫినిషన్ ప్రొజెక్టర్ల వినియోగం,.
7. కథన వివరాలు : కోహినూర్ వజ్రం చరిత్ర, తెలంగాణ ఏర్పాటు, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని వివరించే అంచనాల ద్వారా కథ ప్రసారం
8. సరౌండ్ సౌండ్ సిస్టం: స్పష్టమైన ఆడియో అనుభవం కోసం 5.1 డాల్బీ-స్టైల్ సరౌండ్ సౌండ్ సిస్టం
9. డైనమిక్ లైటింగ్ : నాటకీయ విజువల్ ప్రసారం కోసం కదిలే బీమ్ హెడ్లైట్లు.
10. అతి పెద్ద వాటర్ ఫౌంటెన్ 260 అడుగుల ఎత్తు, 540x130 కొలతలతో దేశంలో అతిపెద్ద, ఎత్తైన నీటి ఫౌంటెన్
11. విద్య, చరిత్రకు ప్రాధాన్యత: :అత్యంత సాంకేతిక విలువలతో ఏర్పాటైన ఈ షో విద్య, చరిత్ర ను కళ్ళకు కట్టే విధంగా చూపిస్తుంది.
***
(Release ID: 2014301)