విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఉత్తరప్రదేశ్‌లోని 50 ఎం డబ్ల్యూ గుజ్రాయ్ సోలార్ పవర్ స్టేషన్‌ను ఎస్ జే వీ ఎన్ కమీషన్ చేస్తుంది

Posted On: 23 FEB 2024 3:36PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలోని ఎస్ జే వీ ఎన్ లిమిటెడ్, మినీ రత్న, కేటగిరీ-I మరియు షెడ్యూల్ 'ఏ' కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్‌లో 50 మెగావాట్ల గుజ్రాయ్ సోలార్ పవర్ స్టేషన్ వాణిజ్య కార్యకలాపాలను  ఫిబ్రవరి 23, 2024 న విజయవంతంగా ప్రారంభించింది. ఎస్ జే వీ ఎన్ ప్రస్తుతం పది పవర్ స్టేషన్లు మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2,277 ఎం డబ్ల్యూ మైలురాయికి చేరుకుంది.

 

ఎస్ జే వీ ఎన్ 50 మెగావాట్ల గుజ్రాయ్ సోలార్ పవర్ స్టేషన్‌ పునరుత్పాదక విభాగం, ఎస్ జే వీ ఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎస్ జీ ఈ ఎల్ ) ద్వారా రూ. 281 కోట్లు, ఉత్పత్తి చేయబడిన ఇంధనం నుండి వార్షిక ఆదాయం సుమారుగా రూ. 32 కోట్లు నమోదు చేసింది. ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో 107 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది మరియు 25 సంవత్సరాల కాలంలో సంచిత శక్తి ఉత్పత్తి 2,477 మిలియన్ యూనిట్లుగా అంచనా వేయబడింది.

 

దేశం యొక్క శిలాజ రహిత ఇంధన ఆధారిత ఇంధన ఉత్పత్తిని పెంచడానికి మరియు 2070 నాటికి నికర జీరో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎస్ జే వీ ఎన్ కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీమతి. గీతా కపూర్ చెప్పారు.

 

ఎస్ జీ ఈ ఎల్ ఈ గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్ ప్రాజెక్ట్‌ను  ఉత్తరప్రదేశ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యూ పి ఎన్ ఈ డీ ఏ) నిర్వహించిన టారిఫ్-ఆధారిత పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా యూనిట్‌కు  రూ. 2.98 టారిఫ్‌ నవంబర్ 2022లో పొందింది.  ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూ పి పి సీ ఎల్)తో 25 సంవత్సరాల కాలానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం  సంతకం చేయబడింది.

 

ఎస్ జే వీ ఎన్ ఇటీవలి కాలంలో బహుళ పునరుత్పాదక ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది, తద్వారా 2030 నాటికి 25 జి డబ్ల్యూ మరియు 2040 నాటికి 50 జి డబ్ల్యూ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలనే దాని భాగస్వామ్య దృష్టిని సాధించడానికి మార్గం సుగమం చేసింది.

 

***



(Release ID: 2008434) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Hindi , Tamil