నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్ కనెక్టివిటీని పెంచే కీలకమైన ఐడబ్ల్యుటి టెర్మినల్ , జెట్టీలను ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్


రూ. 82.48 కోట్లతో నిర్మించిన ఐడబ్ల్యూటి టెర్మినల్ ఏటా 77,000 టిఇయు ల సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఈ ప్రాజెక్టులు సరుకులు , ప్రయాణీకుల మెరుగైన , సున్నితమైన రవాణా ద్వారా బీహార్ లోని నదీతీర సమాజానికి సర్వతోముఖ ఆర్థిక శ్రేయస్సును అందిస్తాయి: శ్రీ సోనోవాల్

ప్రధాన మంత్రి నాయకత్వంలో, ఐ డబ్ల్యూ ఎ ఐ ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా వెళ్ళే ఎన్ డబ్ల్యు-1ను సుమారు రూ.5,000 కోట్ల పెట్టుబడితో విశ్వసనీయమైన కార్గో లాజిస్టిక్స్ మార్గంగా అభివృద్ధి
చేసింది : శ్రీ సోనోవాల్

Posted On: 15 FEB 2024 6:32PM by PIB Hyderabad

బీహార్ రవాణా రంగం లో ప్రముఖ ఘట్టంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల (ఎం పి ఎస్ డబ్ల్యు) మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ బీహార్ లోని బెట్టియా లో కలుఘాట్ ఐడబ్ల్యుటి టెర్మినల్ ను , రెండు కమ్యూనిటీ జెట్టీలను ప్రారంభించారు. కార్యక్రమానికి బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా, పార్లమెంటు సభ్యుడు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు.

బీహార్ లోని సరన్ జిల్లాలో గంగా నది ఉత్తర ఒడ్డున వ్యూహాత్మకంగా ఉన్న కలూఘాట్ ప్రాంత రవాణా నెట్ వర్క్ లో ఒక ముఖ్యమైన అనుసంధానంగా ఆవిర్భవించింది. ఎన్ హెచ్ -19 కు నేరుగా ప్రవేశంతో, టెర్మినల్ సరుకు రవాణాకు, ముఖ్యంగా రక్సౌల్ , ఉత్తర బీహార్ లోతట్టు ప్రాంతాల ద్వారా నేపాల్ వెళ్లే ఎగుమతులకు కీలకమైన అనుసంధానంగా ఉంది. రూ.82.48 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్ మౌలిక సదుపాయాల్లో ఏటా 77,000 టిఇయుల సామర్థ్యంతో 125 మీటర్ల×30 మీటర్ల బెర్త్ ఉంటుంది. కలూఘాట్ టెర్మినల్ ఎన్ హెచ్ -19 తో ప్రత్యక్ష రహదారి కనెక్టివిటీని కలిగి ఉంటుంది ఉత్తర బీహార్ లోని లోతట్టు ప్రాంతాలకు బయలుదేరే లేదా వచ్చే సరుకు రవాణాకు కీలకమైన ప్రదేశంలో ఉంది.

 

ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, "గత 10 సంవత్సరాలలో, జాతీయ జలమార్గాలపై నాలుగు మల్టీ-మోడల్ టెర్మినల్స్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. వీటిలో ఎంఎంటి వారణాసి, సాహిబ్ గంజ్, , హల్దియా,   కలూఘాట్ ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ లను జలమార్గాల ద్వారా అనుసంధానం చేయడం వల్ల ప్రాంతీయ వాణిజ్యం పెరిగింది. ఈ రోజు ప్రారంభించబడిన రూ.86 కోట్ల విలువైన ప్రాజెక్టులు సరుకులు, ప్రయాణీకుల మెరుగైన, సున్నితమైన రవాణా ద్వారా బీహార్ లోని నదీతీర సమాజానికి సర్వతోముఖ ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తాయి" అని అన్నారు.

ఎన్ డబ్ల్యూ-37 ద్వారా నేపాల్, భారత్ లను కలిపేందుకు గండక్ నదిపై మంగళ్ పూర్, బేతియా వద్ద తేలియాడే పొంటూన్ జెట్టీలను రూ.3.33 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. జెట్టీలు వివిధ వస్తువుల ఉత్పత్తిదారులకు మార్కెట్ ప్రాప్యతను గణనీయంగా పెంచుతాయి, ప్రాంతంలో ఆర్థిక మార్పిడి, వృద్ధిని ప్రోత్సహిస్తాయి.

' ప్రాజెక్టులు బీహార్ రవాణా మౌలిక సదుపాయాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయి,   సమ్మిళిత వృద్ధి అభివృద్ధి కోసం అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి' అని మంత్రి అన్నారు.

జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా, నావిగేషనల్ లాక్ నిర్మాణం, అంతరాయం లేని నావిగేషన్ కోసం ఫెయిర్ వే అభివృద్ధిని చేపట్టడం, నైట్ నావిగేషన్, ఆర్ఐఎస్ సౌకర్యాలను అందించడంతో పాటు కార్గో హ్యాండ్లింగ్ కోసం మల్టీమోడల్ టెర్మినల్స్ (ఎంఎంటి), ఇంటర్ మోడల్ టెర్మినల్స్ (ఐఎంటి) నిర్మాణం ద్వారా ఐడబ్ల్యుటి పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ఐడబ్ల్యుఎఐ ప్రారంభించింది. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి, భారతీయ పరిశ్రమను తయారు చేయడానికి జాతీయ జలమార్గాలను ఆచరణీయమైన, అభివృద్ధి చెందుతున్న రవాణా సాధనంగా, ముఖ్యంగా సరుకు రవాణా సాధనంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.  2014లో 05గా ఉన్న జలమార్గాల సంఖ్య 23కి పెరిగింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు జాతీయ జలమార్గాల్లో సరుకు రవాణా గణనీయంగా పెరిగి 108.79 మిలియన్ టన్నుల నుంచి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఓడరేవులు, షిప్పింగ్  జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగరమాల కార్యక్రమం 14,500 కి.మీ సంభావ్య జలమార్గాలను ఉపయోగించుకుంటోంది. సాగరమాల కార్యక్రమం కింద జలమార్గాల సామర్థ్యాన్ని వెలికితీయడానికి జాతీయ జలమార్గాల చట్టం, 2016 కింద 111 (5 ప్రస్తుత మరియు 106 కొత్త) జాతీయ జలమార్గాలను          (ఎన్ డబ్ల్యు) ప్రకటించడం కూడా ఉంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లలో ఎన్ డబ్ల్యు-1; అసోంలో ఎన్ డబ్ల్యూ-2; కేరళలోని ఎన్ డబ్ల్యూ-3లో ఇప్పటికే నావిగేషన్ పరికరాలు, జెట్టీలు, కార్గో లోడింగ్ కోసం యాంత్రిక పరికరాల నిర్వహణ సౌకర్యాలతో టెర్మినల్స్ ను అభివృద్ధి చేశారు. జలమార్గాలు పనిచేస్తున్నాయి మరియు వాటిపై నౌకలు నడుస్తున్నాయి. వీటితో పాటు ఎన్ డబ్ల్యూ-10 (అంబా నది), ఎన్ డబ్ల్యూ-68 (మండోవి నది), ఎన్ డబ్ల్యూ-73 (నర్మదా నది), ఎన్ డబ్ల్యూ-83 (రాజ్ పురి క్రీక్), ఎన్ డబ్ల్యూ-85 (రేవదండ క్రీక్- కుండలికరివర్ వ్యవస్థ), ఎన్ డబ్ల్యూ-91 (శాస్త్రి నది- జైగఢ్ క్రీక్ వ్యవస్థ), ఎన్ డబ్ల్యూ-97 (సుందర్ బన్స్ వాటర్ వేస్), ఎన్ డబ్ల్యూ-100 (నది తప్తి) కూడా నిర్వహణ లో ఉన్నాయి.

సమగ్ర మారిటైమ్ ఇండియా విజన్ (ఎంఐవి)-2030లో భాగంగా ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ (ఐడబ్ల్యూటీ) వాటాను 5 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అమృత్ కాల్ విజన్ 2047 నాటికి 50 జలమార్గాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది దేశవ్యాప్తంగా సమర్థవంతమైన రవాణా నెట్వర్క్ ను సులభతరం చేస్తుంది.

***




(Release ID: 2006497) Visitor Counter : 82


Read this release in: English , Urdu , Hindi