గనుల మంత్రిత్వ శాఖ

రాష్ట్ర యూనిట్: ఆంధ్ర ప్రదేశ్, సదరన్ రీజియన్, “NGCM డేటా యొక్క యుటిలిటీ, NGDR పోర్టల్ మరియు ఎమర్జింగ్టెక్నాలజీస్ ఇన్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌పై 8 ఫిబ్రవరి,2024న విజయవాడలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు (GSI) వర్క్ షాప్”ని నిర్వహించారు

Posted On: 10 FEB 2024 2:26PM by PIB Hyderabad

ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథి గా , శ్రీ V. G. వెంకట రెడ్డి, డైరెక్టర్,  DMG & & MD, APMDC  గారు హాజరై జ్యోతి ప్రజ్వలనతో వర్క్ షాప్‌ ను ప్రారంభించారు. డైరెక్టర్ గారు  మాట్లాడుతూ-ఖనిజ అన్వేషణ ముఖ్యంగా లోతైన నిక్షేపాలు మరియు ఇంధన రంగంలో నమూనా మార్పు యొక్క ప్రాముఖ్యత గురించి ఉద్ఘాటించారు. అలాగే ఆయన GSI పాత్రను హైలైట్ చేశారు&ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులు మరియు మైనింగ్ రంగంలోGSI సహకారం కూడా కోరారు. ఈ కార్యక్రమానికి శ్రీ S. N. మహాపాత్రో, DDG, మరియు శ్రీ సిహెచ్. వెంకటేశ్వరరావు, HoD& ADG, SR, GSI తో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, అనుబంధ రంగాల ONGC, AMD, IBM, PCCF, వ్యవసాయం, భూగర్భ జలాలు, ఉద్యానవన, కోస్టల్ మైనింగ్, NDRF, DME, APSAC, APSDMA తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC),గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ (DMG), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రయత్నంలోభాగస్వాములు. అందుబాటులో ఉన్న జియోసైన్స్డేటాసెట్‌లు మరియు కొత్త NGDR పోర్టల్ ద్వారా వాటి ప్రాప్యత గురించి అందరు వాటాదారులకు అవగాహన కల్పించడం మరియు ఈ భారీ వినియోగం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న డేటాబేస్సాంకేతికతలనుహైలైట్ చేయడం పైఈ వర్క్‌షాప్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

శ్రీ S. N. మహాపాత్ర, DDG, SU: AP తన స్వాగత ప్రసంగంలో వర్క్‌షాప్ యొక్క లక్ష్యం మరియు GSI యొక్క బేస్‌లైన్జియోసైన్స్ డేటా యొక్క ప్రాముఖ్యత గురించి సభకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అందరు వాటాదారుల కోసం నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ (NGDR) పోర్టల్ ద్వారా డేటా వ్యాప్తి మరియు ప్రాప్యతను కూడా ఆయన హైలైట్ చేశారు.

శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు, HoD& ADG, SR, GSI, మాట్లాడుతూ - GSI యొక్క బేస్‌లైన్ డేటా యొక్క ప్రాముఖ్యతను మరియు ఖనిజ అన్వేషణ మరియు పరిశోధనలో వివిధ వాటాదారులకు దాని ఉపయోగాన్ని హైలైట్ చేశారు. ఖనిజ సంపన్న రాష్ట్రాల జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత గురించి ఆయన నొక్కి చెప్పారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అనేది భారతీయ భౌగోళిక శాస్త్రాలు మరియు ఖనిజాల అన్వేషణలో భారతదేశం యొక్క ప్రధాన ఏజెన్సీ. నేషనల్ జియోకెమికల్ మ్యాపింగ్ (NGCM) మరియు నేషనల్ జియోఫిజికల్ మ్యాపింగ్ (NGPM), నేషనల్ ఏరోజియోఫిజికల్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ వంటి జాతీయ ప్రోగ్రామ్‌ల ద్వారా జిఎస్‌ఐనిరంతరంగా జియోలాజికల్, జియోకెమికల్, జియోఫిజికల్బేస్‌లైన్ డేటాను ఉత్పత్తి చేస్తుంది. అలాగేఅప్‌డేట్ కూడా చేస్తుంది. ఖనిజ అన్వేషణ ప్రయత్నాలను మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యం, వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ, పర్యావరణ నిర్వహణ మొదలైన అనుబంధ రంగాలలో ఈ బేస్‌లైన్జియోసైన్స్ డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు  తెలియజేశారు.

నేషనల్ జియోఫిజికల్ మ్యాపింగ్ మరియు NGCM డేటా యొక్క యుటిలిటీ, నేషనల్ జియోకెమికల్ మ్యాపింగ్, నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ (NGDR) పోర్టల్, రీజినల్ మినరల్ టార్గెటింగ్ (RMT) మరియు AI & ML వంటి అభివృద్ధి చెందుతున్న ఖనిజ అన్వేషణసాంకేతికతలపై ఏడు చర్చలతో వర్క్‌షాప్‌లో రెండవ సాంకేతిక సెషన్‌ జరిగింది. ఇంటరాక్షన్ సెషన్‌లో పాల్గొనేవారు చురుగ్గా పాల్గొనడం వల్ల వర్క్‌షాప్‌ను నైపుణ్యాన్ని పంచుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా మార్చారు.

****



(Release ID: 2004785) Visitor Counter : 284


Read this release in: English