పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంచాయతీరాజ్ అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్

प्रविष्टि तिथि: 07 FEB 2024 4:33PM by PIB Hyderabad

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపిఆర్‌) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) యొక్క స్కీమ్‌ని అమలు చేస్తోంది. పిఆర్‌ఐకు ఎన్నికైన ప్రతినిధులు మరియు వారి కార్యకర్తలకు సామాజిక- పంచాయితీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం మరియు అమలు చేయడం వంటి వివిధ అంశాలలో సామర్థ్యాల పెంపుదల మరియు శిక్షణ కోసం సమాజంలోని బలహీన వర్గాలు, మహిళలు మరియు పిల్లలు మరియు ఇతర బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి సహకరిస్తుంది. ఎంఓపిఆర్‌ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎల్‌ఎస్‌డిజి) చొరవ స్థానికీకరణ కింద 'మొత్తం ప్రభుత్వ మరియు కార్యకలాపాలతో వనరులు మరియు కార్యకలాపాల కలయిక ద్వారా థీమ్-ఆధారిత గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి పిఆర్‌ఐ ప్రతినిధుల సామర్థ్యం పెంపుదల మరియు శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సామాజికంగా సురక్షితమైన, మహిళలు మరియు పిల్లల స్నేహపూర్వక గ్రామాలను నిర్ధారించడానికి లింగ సున్నితత్వం మరియు సామాజికంగా సమ్మిళిత అభివృద్ధి కోసం మొత్తం సొసైటీ విధానం అమలు చేయబడుతోంది.

పథకం యొక్క ప్రధాన అంశంగా శిక్షణను అందించడంలో దాని ప్రభావం కోసం ఆర్‌జిఎస్‌ఏ సంబంధిత పథకం యొక్క  మూల్యాంకనంతో పాటు మంత్రిత్వ శాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక (పిడిఐ)ను ప్రవేశపెట్టింది. ఇది వివిధ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పంచాయతీ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలు పనితీరును అంచనా వేయగలదు.

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఒపీఆర్‌) బడ్జెట్‌లో ఆర్‌జీఎస్‌ఏ పథకం కింద పంచాయతీల కంప్యూటరీకరణ, ఇ-పంచాయత్ పథకంపై మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ సొల్యూషన్‌ల కోసం కేటాయింపులు ఉన్నాయి. వీటితో పాటు అన్ని గ్రామ పంచాయతీలకు ఇ-సేవ డెలివరీని అందించడానికి వీలుగా సార్వత్రిక బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని సాధించడానికి డిజిటల్ ఇండియా, భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడం కోసం మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ శాఖతో కలిసి పనిచేసింది.

గ్రామ పంచాయితీల అభివృద్ధి ప్రణాళికలను (జిపిడిపి) రూపొందించి ఆమోదించడానికి గ్రామ పంచాయితీల వాటాదారులు మరియు ఓటర్లందరితో గ్రామ పంచాయతీలు గ్రామసభలు నిర్వహించడంతోపాటు, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు నిర్వహించబడుతున్న ప్రజా ప్రణాళిక ప్రచారాలు (పిపిసి) గ్రామ పంచాయతీల ద్వారా వార్షిక జీపీడిపిని రూపొందించడానిని ముందు సంవత్సరం అందరు వాటాదారులను సంప్రదిస్తుంది.

పిఆర్‌ఐల ఎన్నికైన ప్రతినిధుల సామర్థ్యం పెంపుదల మరియు శిక్షణ కోసం రాష్ట్రాలకు కేంద్ర మద్దతు కోసం ప్రస్తుతం ఉన్న చర్యలు/కార్యక్రమాలు మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ, పంచాయితీల డిజిటలైజేషన్ పిఆర్‌ఐలకు మౌలిక సదుపాయాల మద్దతు, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్ధారించే సంబంధిత మంత్రిత్వ శాఖతో సహకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు కొనసాగుతాయి.

ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

 

 ****


(रिलीज़ आईडी: 2003779) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी