రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేరళలో 12 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరీ


- రూ. 1464 కోట్ల విలువైన మొత్తం 105 కిలోమీటర్ల పొడవుతో 12 జాతీయ రహదారి ప్రాజెక్టుల పనులు

Posted On: 06 JAN 2024 12:04PM by PIB Hyderabad

కేరళ రాష్ట్ర ఆధునిక-రహదారి మౌలిక సదుపాయాలకు అపారమైన విభాగాన్ని జోడిస్తూ.. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రూ.1464 కోట్ల విలువైన 12 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారుమొత్తం 105 కి.మీ పొడవుతో కూడిన ఈ పనులను మంత్రి ప్రారంభించారు.  కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ విమురళీధరన్కేరళ పీడబ్ల్యుడీ మంత్రి శ్రీ పి..మహమ్మద్‌ రియాస్‌, కాసర్గోడ్‌ ఎంపీ శ్రీ రాజ్మోహన్‌ ఉన్నితన్‌, ఎమ్మెల్యేలుసీనియర్‌ అధికారుల సమక్షంలో శుక్రవారం కేరళలోని కాసర్గోడ్లో ఈ పనులకు శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన , ప్రారంభోత్సవం చేశారు.  ప్రతిపాదిత ప్రాజెక్టులు తమిళనాడు మరియు కేరళల మధ్య ఎలాంటి అవాంతారాలు లేని అనుసంధానతను మెరుగుపరచడం, వేగవంతమైన మరియు ఇబ్బంది లేని రవాణాను నిర్ధారిస్తాయి. ఈ చొరవ మొత్తం రవాణా ఖర్చులను తగ్గించే అంశాన్ని కలిగి ఉంది. అంతే కాకుండా, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్‌లను తొలగించడంపై దృష్టి సారించడం వల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గేందుకు దోహదపడుతుందని అంచనా. కేరళలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడం ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉంది. దీనికి తోడు మున్నార్‌కు మెరుగైన యాక్సెసిబిలిటీ పర్యాటక సామర్థ్యాన్ని పెంచుతుందని అంచనా వేయబడింది, అయితే హై-లెవల్ వంతెన నిర్మాణం వరదల సమయంలో 27 కి.మీ ప్రక్కదారిని తొలగిస్తుంది, ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది మరియు కీలకమైన కేరళ ఉత్పత్తుల ఎగుమతికి ప్రయోజనం చేకూరుస్తుంది.

***


(Release ID: 1994046)
Read this release in: English , Urdu , Hindi , Tamil