రక్షణ మంత్రిత్వ శాఖ
ఉత్తర/మధ్య అరేబియా సముద్రంలో అప్రమత్తతతో నిఘా కొనసాగిస్తున్న భారత నౌకాదళ బృందాలు
Posted On:
03 JAN 2024 6:04PM by PIB Hyderabad
భారత నౌకాదళం ఉత్తర/మధ్య అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో సముద్ర భద్రతను పర్యవేక్షిస్తోంది. ఈ మిషన్లో భాగంగా, భారత నౌకాదళ నౌకలు, విమానాలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి, మెరుగైన నిఘాను నిర్వహిస్తున్నాయి.
గత వారం రోజులుగా, ఈ ప్రాంతంలోని భారత నౌకాదళ ప్రత్యేక బృందాలు పెద్ద సంఖ్యలో మత్స్యకారుల పడవల్లో సోదాలు నిర్వహించాయి.
భారత నౌకాదళ సముద్ర నిఘా విమానం, ఆర్పీఎఏలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.
ఐమాక్, ఐఎఫ్సీ ఐఓఆర్ సముద్ర రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నాయి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో వెళుతున్న భారతీయ వ్యాపార నౌకలకు భద్రత కల్పిస్తున్నాయి. ఈఈజెడ్లో మెరుగైన నిఘా కోసం భారతీయ తీర రక్షణ దళంతో భారత నౌకాదళం సమన్వయం చేసుకుంటోంది.
జాతీయ సముద్ర సంస్థల సమన్వయంతో మొత్తం పరిస్థితిని భారత నౌకాదళం నిశితంగా పర్యవేక్షిస్తోంది, ఆ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, నావికులకు భద్రత కల్పిస్తోంది.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NaRUevWZVBpTZGXLlC3wGeoQ1LGyMwmCDntcXufnUmixHo8Hf7u4l2PgRXpz3pSB9_cqrho4fYBsYGuxq_NkqBouLFOvjDVgY37Rx18X22Abdk-49YNb8DqoE3_mvSbEQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pix(1)(4)V00Q.jpeg)
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_Na8mhdgHIR149IRcfkJHF6YgwnKZfVfURy3aCBXyPBRmwSP8Nq1tXjMN93TGCmsdD-vxVUD4nMYGbzXBZngqqUSY4P2DtBC2W-azOETtoIDNTcuTRFIBETdI_4nYa_tWw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Pix(2)(2)UI3R.jpeg)
***
(Release ID: 1993076)
Visitor Counter : 129