సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదార్లతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ
ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాన మంత్రి
హరియాణాలోని సోనిపట్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి కవిత పాటిదార్
మహిళా సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం వేసిన ముఖ్యమైన అడుగు 'నారీ శక్తి వందన్ అధినియం': కవిత పాటిదార్
Posted On:
16 DEC 2023 7:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' లబ్ధిదార్లతో సంభాషించారు. యాత్ర వాహనాల దగ్గర హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రభుత్వ ప్రధాన పథకాల్లో సంపూర్ణతను సాధించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదార్లందరికీ సకాలంలో అందేలా చూస్తారు.
రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి కవిత పాటిదార్, ఈ రోజు, హరియాణా సోనిపట్ జిల్లాలోని షాపూర్ తగా గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదార్లతో వికసిత్ భారత్ ప్రమాణం చేయించి, ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేశారు. వివిధ శాఖలు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరుతోందని శ్రీమతి కవిత పాటిదార్ చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రతి ప్రాంతంలో మోదీ హామీ వాహనం నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా లబ్ధిదార్లకు అందజేస్తున్నట్లు ఆమె వివరించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యమని శ్రీమతి కవిత పాటిదార్ స్పష్టం చేశారు.


ప్రస్తుతం, ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉందని, త్వరలో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. 'నారీ శక్తి వందన్ అధినియం' మోదీ ప్రభుత్వం వేసిన చారిత్రాత్మక అడుగుగా శ్రీమతి కవిత పాటిదార్ అభివర్ణించారు. దేశాభివృద్ధి కోసం, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. దేశ అంతర్గత & బాహ్య భద్రతపై భారత ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోందని వెల్లడించారు.
పార్లమెంట్లో శాంతిభద్రతల లోపంపై శ్రీమతి కవిత పాటిదార్ స్పందించారు, ఆ విషయంలో క్షుణ్ణంగా విచారణ జరుగుతోందని చెప్పారు.
ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు, వ్యవసాయాభివృద్ధిని తెలిపే డ్రోన్లను ప్రదర్శించారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో నిర్మాణాత్మక చర్చలతో పాటు, వారిలో ప్రగతిశీల ఆలోచనలు ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఒక ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మోహన్లాల్, నిర్మల్నగర్ ఎస్డీఎం, ఇతర ఉన్నతాధికార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1987373)