ఆయుష్
లెటెంట్ ట్యూబెర్క్యూలోసిస్పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
Posted On:
01 DEC 2023 5:22PM by PIB Hyderabad
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) దేశంలోని గుప్త క్షయవ్యాధి ఇన్ఫెక్షన్ (ఎల్టిబిఐ)ని నివారించడానికి సమగ్ర శిక్షణ మరియు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నేటి నుండి ప్రారంభించింది. ఇది డిసెంబర్ 2, 2023న ముగుస్తుంది. ఈ వర్క్షాప్ ప్రత్యేకంగా ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రానికి చెందిన ఆయుర్వేద వైద్య అధికారుల కోసం నిర్వహించబడుతుంది. అంతే కాకుండా సోషల్ మీడియా లైవ్ ప్లాట్ఫారమ్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఇందులో భాగమవుతున్నారు.
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కువమంది గుప్త క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో టీబీ బ్యాక్టీరియా శరీరంలో నిద్రాణస్థితిలో ఉంటుంది. దీనిని నివారించడానికి, వివిధ రక్త పరీక్షలు లేదా టీఎస్టీ పరీక్షలను చేయించుకోవడం అవసరం. పాజిటివ్గా తేలితే ఎక్స్- రే చేయించాలి. ఈ రెండు రోజుల వర్క్షాప్లో వ్యాధిని అర్థం చేసుకోవడం, దాని చికిత్స మరియు నిర్వహణకు సంబంధించిన సమాచారం వివిధ సెషన్లలో ఇవ్వబడుతుంది. అంతే కాకుండా వర్క్షాప్లో ఆయుర్వేద నిర్వహణ గురించి సమాచారం ఇవ్వబడుతుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క టిబికి సంబంధించిన వివిధ పథకాల గురించి అవగాహన పంచుకోబడుతుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన టిబి రహిత భారతదేశం ప్రచారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చ జరుగుతుంది. టీబీ రహిత భారత్కు ఆయుర్వేదం దోహదపడుతుంది. ఈ విషయంలో ఏఐఐఏ చేసిన కేస్ స్టడీస్ను కూడా దేశం మరియు ప్రపంచం ముందుకు తీసుకువెళతారు.
ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజ మనోజ్ నేసరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నేతృత్వంలో 2025 నాటికి టీబీని నిర్మూలించే దిశగా పయనిస్తున్నామని, ఈ రంగంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషించగలదన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసిస్తూ టీబీ వంటి వ్యాధులపై పోరాటంలో ప్రపంచ తీర్మానాల వైపు ఏఐఐఏ కొత్త శక్తిని ఇంజెక్ట్ చేస్తుందని అన్నారు.
టీబీ సమాచారం, నిర్వహణ మరియు నిర్ధారణ దిశలో చాలా కాలంగా ఇన్స్టిట్యూట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరియు ఇందులో చాలా విజయం సాధించడం గమనించదగ్గ విషయమని చెప్పారు. ఆయుర్వేదం మరియు అల్లోపతి రెండింటికీ సంబంధించిన ఈ వర్క్షాప్లో పెద్ద సంఖ్యలో నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టీబీ రహిత భారత్పై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టిఇపి) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రఘురామ్ రావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆయుష్) డైరెక్టరేట్, డీన్స్ డాక్టర్ రఘు అరకల్ మరియు ఇతర సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రొఫెసర్ జోనా మరియు డాక్టర్ కజారియా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
***
(Release ID: 1981808)
Visitor Counter : 80