ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కర్ణాటకలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లో పాల్గొన్న – కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 30 NOV 2023 6:46PM by PIB Hyderabad
కేంద్ర నైపుణ్యాభివృద్ధివ్యవస్థాపకతఎలక్ట్రానిక్స్,ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్కర్ణాటకలోని చిక్కబల్లాపుర లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటువాటి ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరేలా చూసేందుకు  యాత్ర దేశవ్యాప్త ఔట్-రీచ్ కార్యక్రమంగా పనిచేస్తుంది
 
 
వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పరస్పర చర్చ సందర్భంగా, కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన పరివర్తన మిషన్‌ గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.  
 
 
 సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “2014 నుంచి వికసిత్ భారత్’ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక లక్ష్యాలతో  పరివర్తనాత్మక మిషన్ను ప్రారంభించారు.  అవినీతిబంధుప్రీతికుటిల పెట్టుబడిదారీ విధానాలను ఎదుర్కోవడం ద్వారా చివరి 5 స్థాయిల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మొదటి 5 స్థాయిల్లో స్థానం కల్పించడంతో పాటుదెబ్బతిన్న ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దడం వంటివి వీటిలో ఉన్నాయి.  ప్రజల జీవితాలను మార్చేందుకుయువ భారతీయులకు అవకాశాలను విస్తరించేందుకు మన ప్రధానమంత్రి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే  విధానాన్ని నిర్దేశించారు.  2014 నుండిభారతదేశం లక్షకు పైగా అంకుర సంస్థలను వృద్ధి చేసింది.  నరేంద్ర మోదీ ప్రభుత్వం  వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ప్రక్షాళన చేయడంతోమన సామూహిక ఆకాంక్ష నూతన భారతదేశ సాకారంగా పరిణామం చెందింది. 2047 నాటికి యువ భారతీయుల అపరిమితమైన శక్తిసామర్థ్యాలతో నడిచే వికసిత్ భారత్‌ ను లక్ష్యంగా చేసుకుని మనం ఈరోజు మన దృష్టిని ఉన్నతంగా ఉంచాము.” అని తెలియజేశారు
 
 

అనంతరంప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గ్యాస్ స్టవ్ఎల్.పి.జి‌. సిలిండర్‌ ను అందజేశారుకేంద్రం నిర్దేశించుకున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా పౌరుల జీవితాలను మెరుగుపరచడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.

 

 

*****



(Release ID: 1981698) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi , Kannada