పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

3వ మహిళా హాకీ ఇంటర్ డిపార్ట్‌మెంట్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ని ప్రారంభించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి

Posted On: 15 NOV 2023 1:31PM by PIB Hyderabad

ఉత్కంఠభరితమైన క్రీడా వాతావరణంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి 3వ హాకీ ఇండియా సీనియర్ మహిళా ఇంటర్ డిపార్ట్‌మెంట్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2023 ప్రారంభించారు. టోర్నమెంట్ ట్రోఫీని శివాజీ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ భోలానాథ్‌తో పాటు భారత హాకీ దిగ్గజాలు అజిత్ పాల్ సింగ్, జాఫర్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.

 

 

శ్రీ హర్దీప్ పురి తన ప్రసంగంలో ఇటీవల ఆసియా మహిళా హాకీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళా జట్టు క్రీడాకారిణులను అభినందించారు. టోర్నమెంట్‌లో పాల్గొనే ఎనిమిది హాకీ జట్ల సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 

 

“ఈ రోజు మీరు ఇక్కడ ఇంటర్-డిపార్ట్‌మెంట్ సీనియర్ మహిళల టోర్నమెంట్‌లో ఆడుతున్నారు, అయితే రేపు, మీలో చాలా మంది భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు, ప్రపంచ ఛాంపియన్‌లుగా, ప్రపంచ బీటర్‌లుగా ఎదుగుతారు. మా వంతుగా, మా అమ్మాయిలకు అత్యుత్తమ సౌకర్యాలు, పర్యావరణాన్ని అందించడానికి మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టము, తద్వారా వారు అంతర్జాతీయ వేదికపై ప్రకాశిస్తారు" అని శ్రీ హర్దీప్ సింగ్ పురి అన్నారు. 

ఈ సందర్భంగా శ్రీ పంకజ్ జైన్ మాట్లాడుతూ, అదే శివాజీ స్టేడియంలో 1982 ఆసియా క్రీడల హాకీ మ్యాచ్‌ల సందర్భంగా వాలంటీర్‌గా సేవలందించిన తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. “ఆ సమయంలో నేను చిన్న పిల్లవాడిని, ఇంకా ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. మీరందరూ చాలా మంది అమ్మాయిలకు, చాలా మంది యువకులకు రోల్ మోడల్స్. మీరు మీ ప్రదర్శనతో రాబోయే తరానికి స్ఫూర్తినిస్తున్నారు. మీ వల్ల వారి కళ్లలో ఆశ, ఆనందం ఉన్నాయి” అని శ్రీ జైన్ ఎనిమిది జట్ల యువ హాకీ ఆటగాళ్లను ఉత్తేజపరిచే ప్రసంగం చేశారు. 

ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీ శ్రీకాంత్ మాధవ్ మహిళల హాకీకే కాకుండా ఇతర క్రీడలకు కూడా అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. "మేము బాధ్యతను అర్థం చేసుకున్నాము.  అడిగినప్పుడల్లా ఎల్లప్పుడూ ముందుకు వచ్చాము. మేము యువ హాకీ క్రీడాకారుల బృందాన్ని ఏర్పాటు చేసాము. మా స్టార్ మహిళా క్రీడాకారిణులకు చాలా అవకాశాలను అందించడాన్ని ఇతరులు త్వరలో అనుసరిస్తారని నేను ఆశిస్తున్నాను, ” అని వైద్య అన్నారు.

హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ  భోలా నాథ్ సింగ్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హాకీకి వివిధ రంగాల నుంచి మద్దతు లభిస్తున్నందున ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు పతకం సాధించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో, చరిత్రకారుడు, 'భారతదేశంలో హాకీ' రచయిత, శ్రీ కె. ఆర్ముగమ్ క్రీడలకు అందించిన కృషికి సత్కరించారు. ఆయనకు ఉన్న ఎన్జిఓ సంస్థ , వన్ థౌజండ్ హాకీ  లెగ్స్ (ఓటిహెచ్ఎల్) ద్వారా ఇరవై ఐదు మంది అమ్మాయిలకు మంత్రి చేతుల మీదగా  సరికొత్త హాకీ స్టిక్‌లను అందజేశారు. 

ఈ ఛాంపియన్‌షిప్ లో దేశవ్యాప్తంగా ఎనిమిది అత్యుత్తమ మహిళా జట్లు పాల్గొంటాయి. పాల్గొనేవారిలో, 12 మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు, టోర్నమెంట్‌కు అనుభవం, నైపుణ్యం సంపదను తీసుకువచ్చారు. టోర్నమెంట్‌లో ఆల్ ఇండియన్ పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, యూకో బ్యాంక్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సశస్త్ర సీమా బాల్, తమిళనాడు పోలీస్, ఆతిథ్యం ఇచ్చిన  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-మహిళలు పాల్గొంటున్న ఎనిమిది జట్లు.

 

***



(Release ID: 1977552) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Tamil