కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికం శాఖ (డాట్) మిషన్ స్వచ్ఛతను పెద్ద ఎత్తున చేపట్టింది
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2023 8:06PM by PIB Hyderabad
టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పెండెన్సీని తగ్గించడానికి, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి కార్యాలయాల్లో పరిశుభ్రత & సమర్థవంతమైన రికార్డు నిర్వహణను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా ఉన్న దాని సంస్థలు/ఫీల్డ్ ఆఫీసులలో ప్రత్యేక ప్రచారం 3.0ని అమలు చేస్తోంది. ఈ ప్రచారానికి సన్నాహక దశ 14.09.2023 నుండి 30.09.2023 వరకు ఉంటుంది. ఈ దశలో లక్ష్యాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. అమలు దశలో, ఈ లక్ష్యాలను 02.10.2023 నుండి 31.10.2023 వరకు సాధించడానికి షెడ్యూల్ చేయబడింది.
03.10.2023 05.10.2023 తేదీలలో సంచార్ భవన్లోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన కార్యదర్శి (టెలికాం) కార్యాలయ పరిశుభ్రత పాత రికార్డుల నుండి కలుపు తీయడం కోసం ఒక ఊపును ఇచ్చారు. సంబంధిత ఉద్యోగులకు సూటిగా ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు, డిపార్ట్మెంట్ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రోజువారీ జీవితంలో స్వచ్ఛత’ అనే అంశంపై ఉద్యోగుల పిల్లలకు డ్రాయింగ్ & పెయింటింగ్ కంప్లీషన్ ద్వారా స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారాన్ని రంగురంగులగా ప్రారంభించారు. డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా 350కి పైగా పరిశుభ్రత స్థలాలను గుర్తించింది ప్రత్యేక ప్రచారం 3.0 సమయంలో పరిష్కారం కోసం 735 పెండింగ్ పబ్లిక్ ఫిర్యాదులను గుర్తించింది. ప్రచార సమయంలో సమీక్ష కోసం 16000 భౌతిక ఫైల్లు దాదాపు 3500 ఈ–-ఫైళ్లు గుర్తించబడ్డాయి. సానుకూల గమనికతో అమలు దశను ప్రారంభించి, డిపార్ట్మెంట్ 01.10.2023న ఆఫీస్ స్క్రాప్ను అమ్మి రూ. 4,58,650/- సంపాదించారు. సీనియర్ స్థాయిలలో రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సైట్లలో పరిశుభ్రత ప్రచారానికి సంబంధించిన కొన్ని స్నిప్పెట్లు క్రింద ఇవ్వబడ్డాయి – గత సంవత్సరం ప్రచారం 2.0తో పోల్చితే ఈ క్యాంపెయిన్ 3.0లో తన పనితీరును మెరుగుపరచాలని డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 1965224)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198