ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.396.5 కోట్ల విలువైన 147 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన ఢిల్లీ కస్టమ్స్ ప్రివెంటివ్ జోన్

Posted On: 15 SEP 2023 3:59PM by PIB Hyderabad

నార్కోటిక్స్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్)కి వ్యతిరేక పోరాటంలో ఒక ప్రధాన దశగా ఢిల్లీ కస్టమ్స్ ప్రివెంటివ్ జోన్ రూ. 396.5 కోట్ల విలువైన 147 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అధికారిక వేస్ట్ మేనేజ్‌మెంట్ సౌకర్యం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ సదుపాయంలో, 56.346 కిలోల హెరాయిన్, 2.150 కిలోల ఎండీఎంఏ హైడ్రోక్లోరైడ్, 0.2193 కిలోల గంజాయి మరియు 1.6475 కిలోల గంజాయితో సహా మొత్తం 60.3628 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. 87 కిలోల బరువు గల 10,894 ఎన్‌డిపిఎస్ – టిఐడిఐజిఈఎస్ఐసి క్యాప్సుల్స్ కూడా నాశనం చేయబడ్డాయి. ధ్వంసమైన చేసిన ఈ లాట్లను న్యూ ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకున్న నిషేధిత వస్తువులను మరియు ధ్వంసపు మొత్తం ప్రక్రియను ఉన్నత స్థాయి డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షించింది. ప్రమాదకర & ఇతర వ్యర్థాల (ఎం&టీఎం) రూల్స్, 2016 మార్గదర్శకాల ప్రకారం నిషిద్ధ వస్తువులుగా కాల్చివేయబడ్డాయి.

 

***


(Release ID: 1957776)
Read this release in: English , Urdu , Hindi , Tamil