శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సి ఎస్ ఐ ఆర్- ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ నిర్వహిస్తున్న వన్ వీక్ వన్ ల్యాబ్ ప్రోగ్రామ్ 3వ రోజు
అట్టడుగు స్థాయిలో ఆవిష్కరణలు, సైన్స్ కమ్యూనికేషన్ వర్క్ షాప్ , స్టూడెంట్ సైన్స్ కనెక్ట్ ప్రోగ్రామ్ ల నిర్వహణ
Posted On:
13 SEP 2023 8:47PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ తన వన్ వీక్ వన్ ల్యాబ్ ( ఒ డబ్ల్యు ఒ ఎల్) కార్యక్రమం మూడో రోజును 2023 సెప్టెంబర్ 13న న్యూఢిల్లీ పూసాలోని సి ఎస్ ఐ ఆర్- ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ఆడిటోరియంలో నిర్వహించింది. మన రైతుల కోసం ‘'గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ కాంక్లేవ్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ ' కార్యక్రమాన్ని ప్రత్యేకించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన సి ఎస్ ఐఆర్ మాజీ డీజీ డాక్టర్ శేఖర్ సి మండే, గౌరవ అతిథిగా హాజరైన అగ్రికల్చర్ సైంటిస్ట్స్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎఎస్ ఆర్బి) చైర్మన్ డాక్టర్ సంజయ్ కుమార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడంతో కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది.

ప్రసంగిస్తున్న డాక్టర్ శేఖర్ సి.మండే (ఎడమ), డాక్టర్ రంజనా అగర్వాల్ (కుడి)
ఈ సందర్భంగా సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్ సిపిఆర్ డైరెక్టర్ డాక్టర్ రంజనా అగర్వాల్ మాట్లాడుతూ, 2023 సెప్టెంబర్ 11 నుంచి మొదలై వారం రోజుల పాటు జరిగే ఈ వన్ లాబ్ వన్ వీక్ కార్యక్రమం నేటి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఒక భాగం అని అన్నారు. ‘కోవిడ్-19 సమయంలో విత్తనం నాటాలనే ఆలోచనను సిఎస్ఐఆర్ మాజీ డీజీ డాక్టర్ శేఖర్ సి మండే అందించారు. ‘
గౌరవ అతిథి డాక్టర్ సంజయ్ కుమార్ తన ప్రసంగంలో "సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి వ్యయం వాటాదారులకు ఆమోదయోగ్యంగా భరించేదిగా ఉండాలి . సాంకేతికత దేశాన్ని శక్తివంతంగా మార్చాలి" అని పేర్కొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీ ప్రవీణ్ రామదాస్, విజ్ఞాన భారతి (విభా) కార్యదర్శి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, "భారత్ కే లియే విజ్ఞాన్" గురించి మాట్లాడారు. విభా మాజీ జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి స్వర్గీయ శ్రీ జయంత్ సహస్రబుద్ధేను స్మరించుకున్నారు. శ్రీ ప్రవీణ్ రామదాసు మాట్లాడుతూ, "మన గ్రామాలు స్వయం సమృద్ధి సాధించనంత వరకు, మన రైతులు స్వయం సమృద్ధి సాధించరు; మన భారతదేశం స్వయం సమృద్ధి సాధించదు" అన్నారు. గ్రామాల్లో సిఎస్ ఐఆర్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ముఖ్య అతిథి డాక్టర్ శేఖర్ సి మండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను పునరుద్ఘాటిస్తూ, "2047 లో, భారతదేశాన్ని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా చూడాలనుకుంటున్నాము, ఈ కలను సాకారం చేసుకోవడానికి గ్రామీణ ప్రజల అభివృద్ధి చాలా ముఖ్యం" అని అన్నారు.
సైంటిస్ట్-ఫార్మర్ ఇంటరాక్షన్ టెక్నికల్ సెషన్ లో, సిఎస్ ఐఆర్ టెక్నాలజీలు ,@ప్రయోగశాలలపై కేంద్రీకృతమైన ప్యానెల్ డిస్కషన్ కు ఒడబ్ల్యూ ఒఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ యోగేష్ సుమన్ మోడరేటర్ గా వ్యవహరించారు. ఐఐటీ ఢిల్లీ సి ఆర్ డి టి ప్రొఫెసర్ డాక్టర్ వివేక్ కుమార్, సీఎస్ఐఆర్- హెడ్ క్వార్టర్స్ లోని టీఎండీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేంద్ర పి.దారోకర్ ఈ ప్యానలిస్టుల్లో ఉన్నారు.ఇంకా , వివిధ సిఎస్ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన అనేక మంది ఇతర శాస్త్రవేత్తలు చర్చలో పాల్గొన్నారు, ప్రయోగశాల ప్రయోగాలు , సమాజం మధ్య అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్రను వారు నొక్కి చెప్పారు. సాంకేతిక సంసిద్ధత స్థాయిపై మాత్రమే దృష్టి పెట్టకుండా, సాంకేతిక సముచితల ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలలో నిర్వహించిన తమ ప్రయోగాలకు సంబంధించిన అంతర్దృష్టులను పంచుకున్నారు, తరువాత, సెషన్ మరింత చర్చల కోసం సాధారణ ప్రజల ను అనుమతించారు.
ఎన్ ఆర్ డిసి (న్యూఢిల్లీ) సీనియర్ మేనేజర్ డాక్టర్ సంజీవ్ కుమార్ మజుందార్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, , మనం తినే పప్పుధాన్యాలు కూడా ఒక సిఎస్ఐఆర్ ప్రయోగశాలలో నిర్వహించిన పరిశోధన ఫలితమని వెల్లడించారు. సిఎస్ ఐఆర్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలన్నీ అంతిమంగా ప్రజాప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.
కిసాన్ సభ యాప్ పై శిక్షణ సెషన్ లో సిఎస్ ఐఆర్ -ఎన్ ఐఎస్ సి పి ఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వినాయక్ ఈ యాప్ ను పరిచయం చేసి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. కిసాన్ సభ యాప్ రూపకల్పనలో సహకరించిన ఎన్ఐఎస్ సి పి ఆర్ కు ఎన్ఐఎస్ సి పి ఆర్ సీనియర్ సైంటిస్ట్, యాప్ కో-డెవలపర్ డాక్టర్ శివ్ నారాయణ్ నిషాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రైతులు, వినియోగదారులు సహా సుమారు 10 లక్షల మంది ఈ యాప్ ను చురుగ్గా ఉపయోగిస్తున్నారని తెలిపారు. రియల్ టైమ్ మార్కెట్ సమాచారం, వివిధ వ్యవసాయ సేవలను ఈ యాప్ అందిస్తుంది. ఉదాహరణకు, రైతులు ఈ యాప్ ద్వారా మార్కెట్ ధరలను సులభంగా తనిఖీ చేయవచ్చు.

గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్న డాక్టర్ శేఖర్ మండే
గ్రామీణ జీవనోపాధి కోసం సిఎస్ఐఆర్ టెక్నాలజీలపై ఎగ్జిబిషన్ నిర్వహించారు, ఇందులో 10కి పైగా సీఎస్ఐఆర్ ల్యాబ్ లు పాల్గొన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ను సిఎస్ఐఆర్ మాజీ డీజీ డాక్టర్ శేఖర్ సి మండే ప్రారంభించారు.
సైన్స్ కమ్యూనికేషన్ పై వర్క్ షాప్ లో 50 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొని సైన్స్ కమ్యూనికేషన్ లోని వివిధ కోణాలపై నిపుణుల ద్వారా శిక్షణ పొందారు. వర్క్ షాప్ లో సి ఎస్ ఐ ఆర్- ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ట్రైనింగ్ , హెచ్ ఆర్ విభాగమైన జిగ్యాస హెడ్ శ్రీ సి.బి.సింగ్ స్వాగతోపన్యాసం చేశారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన గౌరవ ముఖ్య అతిథి ప్రొఫెసర్ శర్మిష్ఠ బెనర్జీ సైన్స్ అధ్యాపకులను ఉద్దేశించి వర్క్ షాప్ లో ప్రసంగిస్తూ, విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ను బోధించాలని నొక్కి చెప్పారు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సహా అన్ని సబ్జెక్టులు ఇంటర్ కు సంబంధించినవేనని, ఈ విషయాన్ని మన విద్యార్థులకు సమర్థవంతంగా చెప్పాలన్నారు.

టీచర్స్ వర్క్ షాప్ కోసం సైన్స్ కమ్యూనికేషన్ దృశ్యం
వర్క్ షాప్ లో సైన్స్ కమ్యూనికేషన్ , సిటిజన్ రెస్పాన్సిబిలిటీ గురించి సిఎస్ ఐఆర్-ఎన్ఐ ఎస్ సి పిఆర్ చీఫ్ సైంటిస్ట్, 'సైన్స్ రిపోర్టర్' మ్యాగజైన్ ఎడిటర్ శ్రీ హసన్ జావేద్ ఖాన్ మాట్లాడుతూ, "సైన్స్ గురించి తప్పుడు సమాచారం , నకిలీ వార్తల గురించి మరింత అవగాహన కల్పించడం దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత” అన్నారు.
సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ అసోసియేట్ ఎడిటర్ శ్రీమతి సోనాలి నాగర్ మాట్లాడుతూ, పాపులర్ సైన్స్ రైటింగ్ సూక్ష్మాంశాలపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీ హసన్ జావేద్ ఖాన్ ఇచ్చిన పాపులర్ సైన్స్ రైటింగ్ అసైన్ మెంట్ తో వర్క్ షాప్ ముగిసింది.
స్టూడెంట్ సైన్స్ కనెక్ట్ ప్రోగ్రామ్
సిఎస్ఐఆర్ జిగ్యాస కార్యక్రమంలో భాగంగా సిఎస్ఐఆర్-ఎన్ఐ ఎస్ సి పి ఆర్ క్యాంపస్ లోని వివేకానంద హాల్ లో 'స్టూడెంట్-సైన్స్ కనెక్ట్' కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఎస్ఐఆర్-ఎన్ఐ ఎస్ సి పి ఆర్ జిగ్యాస ప్రోగ్రామ్ హెడ్ శ్రీ సి బి సింగ్ తన స్వాగతోపన్యాసంలో సైన్స్ కమ్యూనికేషన్ ద్వారా ఎన్ఐ ఎస్ సి పి ఆర్ సామాన్య ప్రజలకు ఎలా చేరువవుతోందో చెప్పారు.
ఈ సందర్భంగా సిఎస్ఐఆర్-ఎన్ఐ ఎస్ సి పి ఆర్ డైరెక్టర్ డాక్టర్ రంజనా అగర్వాల్ మాట్లాడుతూ, ఎన్ఐ ఎస్ సి పి ఆర్ వారధి లా పనిచేస్తోందన్నారు. 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం' సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, చిరుధాన్యాల గురించి సమాచారం ఇచ్చారు. సిఎస్ ఐఆర్ - ఎన్ ఐఎస్ సి పి ఆర్ చొరవ 'స్వస్తిక్' సంప్రదాయ విజ్ఞానానికి శాస్త్రీయ విధానాన్ని ఎలా అందిస్తోందో కూడా ప్రధాన మంత్రి వివరించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే పాల్గొన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు వంటి ప్రశ్నలు మదిలో మెదులాలని ఆయన అన్నారు. మనం ఆలోచించి చర్చించినప్పుడే సైన్స్ అభివృద్ధి చెందుతుంది. పాలంపూర్ సిఎస్ఐఆర్- ఐ హెచ్ బి టి మాజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గణితం, సైన్స్ ను ఆసక్తికరంగా చదివి అర్థం చేసుకునేలా కథల ద్వారా శాస్త్రీయ ఆలోచనను అలవర్చుకోవాలన్నారు.
సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుమన్ రే చిరుధాన్యాల గురించి వివరించారు. సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ ఎన్ఐ ఎస్ సి పి ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, స్వస్తిక్ కోఆర్డినేటర్ డాక్టర్ చారులత మాట్లాడుతూ, భారతదేశానికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో గొప్ప వారసత్వం ఉందన్నారు. సంప్రదాయ విజ్ఞానం మన త్రీ డైమెన్షనల్ పర్సనాలిటీని పెంపొందిస్తుంది.
వికాస్ పురిలోని కేంద్రీయ విద్యాలయం, సెక్టార్ -8, ద్వారకా, ఎంఎం పబ్లిక్ స్కూల్, షకుర్ పూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ మిశ్రా, ఆయన బృందం తోలుబొమ్మ ప్రదర్శన ఇచ్చారు.

సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ గురించి
సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్- ఎన్ఐ ఎస్ సి పి ఆర్) భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ( సిఎస్ఐఆర్) అనుబంధ ప్రయోగశాలల్లో ఒకటి. ఇది సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్, టెక్నాలజీ , ఇన్నోవేషన్ (ఎస్ టిఐ) రంగాలలో సాక్ష్యం ఆధారిత విధాన పరిశోధన , అధ్యయనాలపై దృష్టి పెడుతుంది. ఇది వివిధ జర్నల్స్, పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్ లెటర్లు ,సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నివేదికలను ప్రచురిస్తుంది.ఇది సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్ పాలసీ, ఇన్నోవేషన్ సిస్టమ్స్, సైన్స్-సొసైటీ ఇంటర్ ఫేస్, సైన్స్ దౌత్యంపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
మరింత సమాచారం కోసం https://niscpr.res.in/ సందర్శించండి లేదా @CSIR-NISCPR ను అనుసరించండి.
***
(Release ID: 1957244)