బొగ్గు మంత్రిత్వ శాఖ
గత సంవత్సరాల తో పోల్చి చూస్తే గణనీయంగా పెరిగిన బొగ్గు వినియోగం విద్యుత్ రంగానికి సాఫీగా బొగ్గు సరఫరా జరిగే విధంగా వివిధ చర్యలు
Posted On:
09 AUG 2023 2:14PM by PIB Hyderabad
దేశంలో 2022-23 సంవత్సరంలో బొగ్గు వినియోగం 1115.02 ఎంటీ (తాత్కాలిక)ల వరకు ఉంది. 1983-84 సంవత్సరంలో మొత్తం బొగ్గు వినియోగం 130.73 ఎంటీ గా ఉంది. 1983-84 తో పోల్చి చూస్తే 2022-23 సంవత్సరంలో బొగ్గు వినియోగం దాదాపు 753% వృద్ధిని సాధించింది.విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా అనేది నిరంతర ప్రక్రియ. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా చేసే అంశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు. వివిధ కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ , కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులతో కూడిన ఇంటర్-మినిస్టీరియల్ సబ్ గ్రూప్ క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి, విధ్యుత్ రంగంలో ఏర్పడే అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి, విధ్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగినంతగా వుండేలా చూసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన ఇంటర్-మినిస్టీరియల్ సబ్ గ్రూప్ చర్యలు తీసుకుంటుంది.
అంతేకాకుండా, రైల్వే బోర్డు ఛైర్మన్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శి, సభ్యులుగా మరో ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ (IMC) కూడా ఏర్పాటు అయ్యింది. బొగ్గు సరఫరా , విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపుదల అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అవసరమైన సమయాల్లో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిఈఏ ఛైర్పర్సన్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరవుతారు.
బొగ్గు, లిగ్నైట్ తవ్వడానికి కొత్త ప్రాంతాలను కనుగొనడం అనేది నిరంతర ప్రక్రియ. బొగ్గు, లిగ్నైట్ నిక్షేపాలు లభించే ప్రాంతాలను అన్వేషించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కేంద్ర పథకం అమలు జరుగుతోంది. దీనితో పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కూడా బొగ్గు తో సహా ఖనిజాల పరిశోధనను నిర్వహిస్తుంది.
కేంద్ర బొగ్గు, గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1947270)