యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిట్ ఇండియా మిషన్ న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి ఈరోజు త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటర్-మినిస్ట్రీ బార్ & బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్‌ను నిర్వహిస్తోంది


కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

Posted On: 05 AUG 2023 8:32PM by PIB Hyderabad

ఫిట్ ఇండియా మిషన్ న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి శనివారం ఇక్కడి త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటర్-మినిస్ట్రీ బార్ & బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌ను నిర్వహించింది.

 

ఈ టోర్నమెంట్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. సాంప్రదాయక దుస్తులు ధరించి, మంత్రి ఉత్సాహంతో పాల్గొనడం తో పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆకట్టుకునే స్ట్రోక్స్ తో ప్రేక్షకులను అలరించారు.

 

"మీరు దృఢం గా ఉండటానికి కొన్ని క్రీడలు ఆడాలి. ఇక్కడ పాల్గొంటున్న మా గౌరవ న్యాయమూర్తులు మరియు న్యాయవాదులు శారీరక దృఢత్వం  ఉంటే భారతదేశం దృఢంగా ఉంటుందని అంగీకరిస్తారు" అని శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.

 

"భారతదేశంలో మన సాధువులు మరియు ఋషులు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మనకు బోధించే సంప్రదాయం ఉంది. క్రీడల ద్వారా మనం దృఢంగా ఉండగలమనే స్పృహ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అది గ్రామీణ లేదా పట్టణ ప్రాంతంలో అయినా, మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా మీరు ప్రతిచోటా  క్రీడలను నిర్వహిస్తున్నారు. ”అన్నారు.

 

"మాది రాజస్థాన్‌లోని బికనీర్.  మా ప్రాంతంలో కబడ్డీ మరియు ఖో-ఖో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ సమయంలో బ్యాడ్మింటన్‌ను నగర లేదా పట్టణ క్రీడగా చూసేవారు. నేడు బ్యాడ్మింటన్ మిమ్మల్ని దృఢంగా ఉంచడమే కాకుండా ఇప్పుడది బృంద స్ఫూర్తి, సమన్వయం మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించే క్రీడగా కూడా పేరుగాంచింది. ఈ అద్భుతమైన చొరవచూపిన నిర్వాహకులను మరియు పాల్గొనేవారిని నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు.

 

పౌరులలో శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఫిట్ ఇండియా మిషన్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 29, 2019న ప్రారంభించారు. మన దైనందిన జీవితంలో రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా క్రీడ లేదా ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేపట్టడాన్ని ప్రచారం చేయడం ఈ ఉద్యమం లక్ష్యం. ఇందులో స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం లేదా నిశ్చల బద్దక జీవనశైలిని తొలగించే డ్యాన్స్ వంటి ఏదైనా ప్రాథమిక ఫిట్‌నెస్ యాక్టివిటీ ఉంటుంది.

 

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయవాదులు శ్రీ వికాస్ సింగ్ మరియు శ్రీ ప్రదీప్ రాయ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

“సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్‌తో సహా సుప్రీంకోర్టు బార్ సభ్యుల మద్దతుతో ఇంటర్ మినిస్ట్రీ టోర్నమెంట్ నిర్వహించడం ఇది రెండోసారి. ఇందులో న్యాయమూర్తులు, పలువురు సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు మరియు అన్ని వయసుల వర్గాల నుండి సి బీ డి టి తో సహా మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొంటారు. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమం మరియు ఈ రకమైన టోర్నమెంట్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలి, తద్వారా ఉద్యోగాలలో నిమగ్నమైన వ్యక్తులు సాధారణంగా చాలా ఒత్తిడికి గురవుతారు వారు ఈ రకమైన టోర్నమెంట్‌ వల్ల ప్రయోజనం పొందగలరు, ”అని ఇండియా లీగల్ ఎయిడ్ సెంటర్ చైర్మన్ కూడా అయిన రాయ్ అన్నారు. .

 

టోర్నమెంట్‌లో మొత్తం 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల మరియు మహిళల డబుల్స్ విభాగాల్లో 64 జట్లు పోటీ పడ్డాయి.

 

ఈ ఈవెంట్‌ను మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అబాంతికా డేకా న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ మరియు ఫిట్ ఇండియా మిషన్ భాగస్వామ్యంతో నిర్వహించారు.

 

“ప్రారంభ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత, ఇంటర్ మినిస్ట్రీ బార్ మరియు బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ యొక్క రెండవ ఎడిషన్ లో ప్రోత్సాహకరమైన భాగస్వామ్యానికి మేము సంతోషిస్తున్నాము. పాల్గొనేవారి వయస్సు లేదా వృత్తితో సంబంధం లేకుండా వారి ఉత్సాహం మరియు శక్తి స్థాయిలు, క్రీడా స్ఫూర్తి అంటువ్యాధి వంటివని ," డేకా అన్నారు.

 

“ఈ సంవత్సరం అక్టోబర్ నుండి దేశవ్యాప్తంగా ఇంటర్ మినిస్ట్రీ బార్ మరియు బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు ఇది మాకు స్ఫూర్తినిచ్చింది. అదనంగా, నేను అనేక ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఈవెంట్‌లను కూడా నిర్వహిస్తాను. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన మరియు యోగ్యమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి చాలా ఉత్సాహం ఉంది.

 

“మాతో సహకరించినందుకు ఫిట్ ఇండియా మిషన్‌కి  నా కృతజ్ఞతలు. ఫిట్ ఇండియా అనేది ఒక అద్భుతమైన చొరవ, మరియు ఫిట్‌నెస్ కు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి అనే నా స్వంత తత్వం ను ఇది ప్రతిధ్వనిస్తుంది. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడినందున, ఒకరి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కి క్రీడ ఎలా దోహదపడుతుందో నేను అర్థం చేసుకున్నాను.

 

"గౌరవ కేంద్ర న్యాయ మరియు న్యాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా   ఉత్సాహంతో పాల్గొనడం హృదయపూర్వకంగా నాకు ఎంతో ఆనందం గా  ఉంది" అని ఆమె అన్నారు.

 

***

 



(Release ID: 1946170) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Hindi , Tamil