బొగ్గు మంత్రిత్వ శాఖ
2022-23లో మెరుగైన బొగ్గు ఉత్పత్తిని సాధించిన తొమ్మిది రాష్ట్రాలు
Posted On:
31 JUL 2023 4:34PM by PIB Hyderabad
దేశం 2022-23వ ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక బొగ్గు ఉత్పత్తిని సాధించింది. అంతకు ముందు ఏడాది, 2021-22లో ఉత్పత్తి చేసిన 778. 21 ఎంటిలతో పోలిస్తే 14.77% వృద్ధితో 2022-23వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి 893.19 మిలియన్ టన్నులు (ఎంటి) (తాత్కాలిక గణాంకం) ఉత్పత్తి జరిగింది.
బొగ్గు ఉత్పత్తి 2022-23వ సంవత్సరంలో అస్సాం, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్ & పశ్చిమ బెంగాల్లలో గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల నమోదు అయింది.
కాగా, జమ్మూ కాశ్మీర్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2022-23వ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి తగ్గినట్టు నమోదు అయింది.
దేశంలో బొగ్గు అవసరాలను దేశీయ ఉత్పత్తి/ సరఫరా ద్వారా నెరవేరుస్తున్నారు. బొగ్గు దేశీయ ఉత్పత్తిని పెంచి, దేశంలోకి అవసరం లేని బొగ్గు దిగుమతులను నివారించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం అన్నది అనవసరమైన బొగ్గు దిగుమతులను నివారించడమే కాక, దేశంలో దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గింవచ్చు.
ఈ సమాచారాన్ని సోమవారం రాజ్యసభకు లిఖతపూర్వకంగా ఇచ్చిన జవాబులో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.
***
(Release ID: 1944501)