గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
జాతీయ గణాంకాల కమిషన్
Posted On:
31 JUL 2023 4:35PM by PIB Hyderabad
దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యక్రమాలకు నోడల్ & సాధికార సంస్థగా పనిచేయడానికి, గణాంక ప్రాధాన్యతలు, ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి, పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి & వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం జాతీయ గణాంకాల కమిషన్ను (ఎన్ఎస్సీ) ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రంగరాజన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, 1 జూన్ 2005న ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు, జాతీయ గణాంకాల కమిషన్లో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు, ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడు ఉన్నారు.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ ఇవాళ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 1944498)