ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పథకాలు

Posted On: 25 JUL 2023 5:52PM by PIB Hyderabad

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధిని నిర్ధారించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్‌ఒఎఫ్‌పిఐ) కేంద్ర రంగ  పథకం ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పిఎంకెఎస్‌వై) ద్వారా సంబంధిత మౌలిక సదుపాయాల ఏర్పాటు/విస్తరణను ప్రోత్సహిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పిఎల్‌ఐఎస్‌ఎఫ్‌పిఐ) మరియు కేంద్ర ప్రాయోజిత పిఎం పార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పిఎంఎఫ్‌ఎంఈ) పథకం కర్ణాటక గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా  దేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

పిఎంకెఎస్‌వై యొక్క కాంపోనెంట్ స్కీమ్‌ల క్రింద ఎమ్‌ఒఎఫ్‌పిఐ ఎక్కువగా క్రెడిట్ లింక్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (క్యాపిటల్ సబ్సిడీ)ని గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో వ్యవస్థాపకులకు అందిస్తుంది. పిఎంకెఎస్‌వై అనేది ఏదైనా ప్రాంతం లేదా రాష్ట్రానికి మాత్రమే నిర్దిష్టమైనది కాదు కానీ డిమాండ్‌తో నడిచేది.ఇది కర్ణాటక గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఇప్పటివరకు పిఎంకెఎస్‌వై యొక్క సంబంధిత కాంపోనెంట్ స్కీమ్‌ల కింద దేశవ్యాప్తంగా 41 మెగా ఫుడ్ పార్కులు, 382 కోల్డ్ చైన్ ప్రాజెక్ట్‌లు, 72 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్‌లు, 469 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 61 బ్యాక్‌వర్డ్ & ఫార్వర్డ్ లింకేజ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు మరియు 46 ఆపరేషన్ గ్రీన్ ప్రాజెక్ట్‌లను మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటిలో 2 మెగా ఫుడ్ పార్కులు, 17 కోల్డ్ చైన్ ప్రాజెక్ట్‌లు, 4 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లు, 19 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు 3 బ్యాక్‌వర్డ్ & ఫార్వర్డ్ లింకేజ్ ప్రాజెక్ట్‌లు కర్ణాటకలో ఉన్నాయి. పిఎంకెఎస్‌వై ద్వారా పూర్తయిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా రైతులకు మరియు కర్ణాటకలో 1.8 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంచనా వేయబడింది.

పిఎంఎఫ్‌ఎంఈ పథకం కింద 2 లక్షల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు/అప్‌గ్రేడేషన్ కోసం మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ పథకం 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల పాటు రూ. 10,000 కోట్లతో అమలు చేయబడుతోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 38466 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ సహాయం కోసం ఆమోదించబడ్డాయి, వాటిలో 2444 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కర్ణాటకలో ఉన్నాయి.

పిఎల్‌ఎస్‌ఎఫ్‌పిఐ అనేది ప్రపంచ ఆహార తయారీ ఛాంపియన్‌లను రూపొందించడానికి మద్దతు ఇవ్వడానికి మరియు అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బ్రాండ్‌ల ఆహార ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఈ పథకం 2021-22 నుండి 2026-27 వరకు ఆరు సంవత్సరాల వ్యవధిలో రూ.10,900 కోట్లతో అమలు చేయబడుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులలో మొత్తం రూ. 318.97 కోట్ల పెట్టుబడి పెట్టబడింది.

కొన్నిసార్లు పిఎంకెఎస్‌వై కింద ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లు రాష్ట్ర ప్రభుత్వం నుండి చట్టబద్ధమైన అనుమతులు/సర్టిఫికెట్‌లను పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొంటాయి. స్థాపనకు సమ్మతి, ఆపరేట్ చేయడానికి సమ్మతి, బిల్డింగ్ ప్లాన్ ఆమోదం, విద్యుత్ కనెక్షన్ మొదలైన వాటికి సంబంధించినవి ఇందులో ఉన్నాయి. అలాగే, కేంద్ర ప్రాయోజిత పిఎంఎఫ్‌ఎంఈ పథకంలో సరిపోలే రాష్ట్ర నిధుల విడుదల కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఈ అడ్డంకుల తొలగింపు కోసం మంత్రిత్వ శాఖ వాటాదారులతో సమన్వయం చేస్తుంది.

ఈ విషయాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి  శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 

****



(Release ID: 1943018) Visitor Counter : 99


Read this release in: English , Urdu