కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఉద్యోగుల భవిష్య నిధి పథకం

Posted On: 24 JUL 2023 4:13PM by PIB Hyderabad

ఉద్యోగుల భవిష్యనిధి మరియు ఇతర నిబంధనల (ఈపీఎఫ్ అండ్ ఎంపీ ) చట్టం, 1952 కింద రూపొందించబడిన మూడు పథకాల్లో ఉద్యోగుల భవిష్య నిధి ( ఈపీఎఫ్) పథకం, 1952 ఒకటి. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే  ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా  పథకం  జరుగుతోంది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేస్తూ నెలకు 15,000 రూపాయల వరకు వేతనం పొందుతున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈపీఎఫ్ లో చేరాల్సి ఉంటుంది. ప్రాథమిక వేతనాలు, కరువు భత్యం  మరియు రిటైనింగ్ అలవెన్స్ ఏదైనా ఉంటే దానిని కలుపుకుని వేతనంలో  12% మొత్తాన్ని ఈపీఎఫ్ లో జమ చేయాల్సి ఉంటుంది.  యజమాని కూడా 12% వేతనాన్నితన వాటాగా జమ చేయాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం, యజమానులుఉద్యోగులు  రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉండే  ట్రస్టీల బోర్డుఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహిస్తుంది.  నిర్వహించబడుతుంది. 

 పథకం నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యత్వం కలిగిన ప్రతి ఉద్యోగి  ఉపసంహరణ, వివిధ ప్రయోజనాల కోసం (అంటే నివాస గృహం కొనుగోలు/నిర్మాణం, అనారోగ్యం, విద్య, వివాహం, కోవిడ్-19 మొదలైనవి) అడ్వాన్స్‌ల ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.  ప్రతి సంవత్సరం అతని/ఆమె తాము చెల్లించిన మొత్తంపై  వడ్డీ పొందుతారు. 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం  వారీగా (ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్, ప్రయాగ్‌రాజ్ జిల్లా, మహారాష్ట్రలోని రత్నగిరి మరియు సింధుదుర్గ్ జిల్లాల వివరాలతో సహా) ఉద్యోగుల వివరాలు (యూనివర్సల్ ఖాతా నంబర్‌లు గత ఏడాది వేతన నెల జూలై, 2022 నుంచి జూన్, 2023 వరకు కనీసం ఒక్కసారైనా మొత్తం జమ చేసిన, నిష్క్రమించని ) అనుబంధంలో అందించడం జరిగింది. 

ఈపీఎఫ్ పథకం, 1952 లో చేరడానికి   వేతన పరిమితి ఎప్పటికప్పుడు సవరించబడుతుంది.  01.09.2014 నుంచి పరిమితి  నెలకు రూ.15000/-గా ఉంది. 

ఈపీఎఫ్ పథకం  1952లోని పేరా 72(6) ప్రకారం, కొన్ని ఖాతాలు అమలులో లేని  ఖాతాలుగా వర్గీకరించబడ్డాయి. అయితే, అటువంటి పని చేయని ఖాతాలన్నింటికీ ఖచ్చితమైన హక్కుదారులు ఉంటారు. 31.03.2022 నాటికి అమలులో లేని ఖాతాల్లో  మొత్తం రూ. 4962.70 కోట్లు నిల్వలు ఉన్నాయి. 

అనుబంధం

 లోక్‌సభలో 24.07.2023న డాక్టర్ సంఘమిత్ర మౌర్య,  శ్రీ సంజయ్ జాదవ్, శ్రీమతి కేశరీ దేవి పటేల్ ' ఈపీఎఫ్ పథకం'పై నక్షత్రం లేని ప్రశ్న నం. 586కి ఇచ్చిన సమాధానం  పార్ట్‌లు (బి) & (సి) లకు సంబంధించిన వివరాలు అనుబంధంలో పొందుపరచబడ్డాయి. 

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం  వారీగా (ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ , ప్రయాగ్‌రాజ్ జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి మరియు సింధుదుర్గ్ జిల్లాల వివరాలతో సహా)  ఈపీఎఫ్  లో రెగ్యులర్ ప్రాతిపదికన విరాళాలు అందజేస్తున్న ఉద్యోగుల వివరాలు ( గత ఏడాది వేతన నెల జూలై, 2022 నుంచి జూన్, 2023 వరకు కనీసం ఒక్కసారైనా మొత్తం జమ చేసిన యూనివర్సల్ ఖాతా నంబర్‌లు)

క్ర.సం. నం.

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

ఉద్యోగులు

1

అండమాన్ మరియు నికోబార్ దీవులు

20240

2

ఆంధ్రప్రదేశ్

1500966

3

అరుణాచల్ ప్రదేశ్

11642

4

అస్సాం

361954

5

బీహార్

1163720

6

చండీగఢ్

594835

7

ఛత్తీస్‌గఢ్

656683

8

దాద్రా , నగర్ హవేలి

165025

9

డామన్ మరియు డయ్యూ 

109811

10

ఢిల్లీ

4007063

11

గోవా 

250279

12

గుజరాత్

4187709

13

హర్యానా

3617407

14

హిమాచల్ ప్రదేశ్

435518

15

జమ్మూ, కాశ్మీర్

194754

16

జార్ఖండ్

690022

17

కర్ణాటక

7537917

18

కేరళ

1249560

19

లడఖ్

2356

20

లక్షదీవులు 

40

21

మధ్యప్రదేశ్

1453179

22

మహారాష్ట్ర

13431905

రత్నగిరి (37782) & సింధుదుర్గ్ (8422)

23

మణిపూర్

16924

24

మేఘాలయ

41049

25

మిజోరం

4234

26

నాగాలాండ్

11224

27

ఒడిశా

1091497

28

పుదుచ్చేరి

132719

29

పంజాబ్

851871

30

రాజస్థాన్

1725304

31

సిక్కిం

30711

32

తమిళనాడు 

6530368

33

తెలంగాణ

3966619

34

త్రిపుర

33572

35

ఉత్తర ప్రదేశ్

3145415

బదౌన్(4287), ప్రయాగ్‌రాజ్(76790)

36

ఉత్తరాఖండ్

734969

37

పశ్చిమ బెంగాల్

3264085

 

మొత్తం

63223146

 

ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ. లోక్‌సభలో రామేశ్వర్‌ లిఖితపూర్వక సమాధానంలో అందజేశారు. 

***



(Release ID: 1942284) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Tamil