సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉద్యోగ, స్వయం ఉపాధి కలపనను ప్రోత్సహించడంలో రోజ్గార్ మేళా ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తుందన్న డాక్టర జితేంద్ర సింగ్
Posted On:
20 JUL 2023 4:04PM by PIB Hyderabad
వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. రోజ్గార్ మేళామరింత ఉపాధి, స్వయం ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పని చేయడమే కాక యువతకు లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా. ఈ సమాచారానని కేంద్ర శాస్త్ర & సాంకేతిక, సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), పిఎంఒ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర జితేంద్ర సింగ్ రాజ్యసభకు నేడు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
రోజ్గార మేళాలో భాగంగా, ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు డాక్టర జితేంద్ర సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, నూతనంగా నియమితులైన వారిని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్యులు), ఆరోగ్యం & విద్య సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితరాలు సహా స్వయంప్రతిపత్తి సంస్థలలోకి చేర్చుకుంటున్నట్టు వివరించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్యులు), ఆరోగ్యం & విద్య సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితరాలు సహా స్వయంప్రతిపత్తి సంస్థలు ప్రత్యక్షంగా కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సెనల సెలక్షన్ తదితర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుపుతాయన్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన (ఎస్ఎస్సి) 2022-2023వ సంవత్సరంలో (10.07.2023వరకు) 1,25, 514 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసిందని, 2022-2023 & 2023-2024 సంవత్సరంలో (10.07.2023వరకు) ఎస్ఎస్సి చేసిన సూచన ప్రకారం అవి వరుసగా 73,721 & 45,782 గా ఉన్నాయి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) 6,697 ఖాళీలకు 2022-23 వ సంవత్సరంలో నోటిఫై చేసి 5,777 సూచనలు చేసిందని డిఒపిటి మంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్యులు), ఆరోగ్యం & విద్య సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితరాలు సహా స్వయంప్రతిపత్తి సంస్థలు ప్రత్యక్షంగా కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సెనల సెలక్షన్ తదితర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుపుతాయని ఆయన పేర్కొన్నారు. .
***
(Release ID: 1941282)