వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్‌పై జాతీయ వర్క్‌షాప్‌ని డీపీఐఐటీ విజయవంతంగా నిర్వహించింది


పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు మొత్తం జీ డీ పీ లో తయారీ రంగం వాటాను పెంపొందించడంలో పారిశ్రామిక పార్కుల ప్రాముఖ్యతపై డీపీఐఐటీ కార్యదర్శి మాట్లాడారు.

Posted On: 01 JUL 2023 5:39PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈరోజు న్యూఢిల్లీలో ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐ పీ ఆర్ ఎస్)పై నేషనల్ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ, పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు మొత్తం జీ డీ పీలో తయారీ రంగం వాటాను పెంపొందించడంలో పారిశ్రామిక పార్కుల ప్రాముఖ్యతపై ఉద్ఘాటించారు.

 

ఐ పీ ఆర్ ఎస్  వర్క్‌షాప్‌ను అద్భుతంగా విజయవంతం చేయడంలో అంకితభావం మరియు అవిశ్రాంతంగా కృషి చేసినందుకు పాల్గొన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, స్టీరింగ్ కమిటీ మరియు సహకార బృందాలకు శ్రీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

వర్క్‌షాప్ భారతదేశం యొక్క పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమం, ఇది భారతదేశంలో మెరుగైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సృష్టించడంలో విజ్ఞాన-భాగస్వామ్యాన్ని మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి డీపీఐఐటీ మరియు రాష్ట్ర/యూ టీ ల నుండి ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు మరియు వాటాదారులను ఒకచోట చేర్చింది.

 

ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టం (ఐ పీ ఆర్ ఎస్) అనేది డీపీఐఐటీ  పెద్ద చొరవ. ఐ పీ ఆర్ ఎస్ 2.0, 5 అక్టోబర్, 2021న ప్రారంభించబడింది, పారిశ్రామిక పార్కులను నాలుగు అంశాల ఆధారంగా రేట్ చేస్తుంది: అంతర్గత మౌలిక సదుపాయాలు మరియు వినియోగాలు, బాహ్య మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు, వ్యాపార మద్దతు సేవలు మరియు పర్యావరణ మరియు భద్రత నిర్వహణ. ఈ రేటింగ్ సిస్టమ్ వాణిజ్య శాఖద్వారా నామినేట్ చేయబడిన 50 అదనపు ప్రత్యేక ఆర్థిక మండలాలతో (SEZs) 31 పాల్గొనే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి నామినేషన్లను పొందింది.

 

వర్క్‌షాప్ పాల్గొన్న ప్రతినిధులు నవంబర్ 2022 నుండి మార్చి 2023 వరకు రాష్ట్రాలు/యుటిల సహకారంతో నిర్వహించిన వ్యక్తిగత వర్క్‌షాప్‌లో గమనించిన ఉత్తమ అభ్యాసాలను పరస్పరం మార్పిడి చేసుకునే అవకాశాన్ని పొందారు. వీటిలో సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థలు, స్థానిక స్వీయ-పరిపాలన నమూనాలు, పరిశ్రమ-కేంద్రీకృతం ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు, మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మరియు పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి సాధారణ సౌకర్యాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

 

అదనంగా, పరిశ్రమ, ప్రభుత్వం, థింక్ ట్యాంక్‌లు మరియు బహుపాక్షిక సంస్థల నుండి నిపుణులను ఒకచోట చేర్చిన ఈ వేదిక లో అర్థవంతమైన ప్యానెల్ చర్చ కూడా జరిగింది.  "వినూత్న ఆర్థిక పరిష్కారాలతో స్మార్ట్, రెసిలెంట్ మరియు ఎకో-ఇండస్ట్రియల్ పార్క్‌లను సృష్టించడం" అనే అంశం పై ప్యానెల్ చర్చ జరిగింది.

 

ఐ పీ ఆర్ ఎస్ పై జాతీయ వర్క్‌షాప్ పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు మరియు లబ్దిదారులకు వారి విలువైన అంతర్దృష్టులు మరియు ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికగా పనిచేసింది. పార్క్ నిర్వహణ మరియు పాలనా పనితీరును మెరుగుపరచడం, పర్యావరణ పనితీరును మెరుగుపరచడం, సామర్థ్యాన్ని పెంచడం, సుస్థిరతను ప్రోత్సహించడం మరియు పారిశ్రామిక పార్కు పోటీతత్వాన్ని పెంపొందించడంపై చర్చలు దృష్టి సారించాయి.

ఈ సహకార విధానం తో భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి పురోగతిని కొనసాగించడం, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఊహించిన విధంగా సాధికారత‌తో కూడిన స‌మ‌గ్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సాకారం చేసేందుకు డిపిఐఐటి కట్టుబడి ఉంది.

 

వ్యాపార పర్యావరణ వ్యవస్థను మార్చడానికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి డీపీఐఐటీ వివిధ పథకాలను కార్యక్రమాలను అమలు చేసింది. పెట్టుబడులను త్వరితగతిన ట్రాక్ చేయడానికి ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్, క్రమబద్ధీకరించిన సులభతర వ్యాపారం కోసం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ తో ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు, ఒక జిల్లా ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం యొక్క ఉనికిని బలోపేతం చేయడానికి ఒక-ఉత్పత్తి పథకం మరియు ఉత్పత్తి-అనుబందిత ప్రోత్సాహక పథకాలను కార్యక్రమాలను అమలు చేసింది.


***



(Release ID: 1936791) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi