కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం


మూడవ పునరుద్ధరణ ప్యాకేజీ వ్యయం రూ.89,047 కోట్లు


బిఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుండి రూ.2,10,000 కోట్లకు పెంపు

Posted On: 07 JUN 2023 2:59PM by PIB Hyderabad

ఒక ముఖ్యమైన చర్య మరియు పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు బిఎస్‌ఎన్‌ఎల్‌కు మూడవ పునరుద్ధరణ ప్యాకేజీకి రూ. 89,047 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇందులో ఈక్విటీ ఇన్ఫ్యూషన్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఉంటుంది.

 బిఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెరుగుతుంది.

 ఈ పునరుద్ధరణ ప్యాకేజీతో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంపై దృష్టి సారించిన స్థిరమైన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్భవిస్తుంది.

 

స్పెక్ట్రమ్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

బ్యాండ్

కేటాయించిన స్పెక్ట్రమ్

బడ్జెట్ మద్దతు

700 ఎంహెచ్‌జడ్

22 ఎల్‌ఎస్‌ఏలలో 10 ఎంహెచ్‌జడ్‌ జత చేయబడింది

రూ. 46,338.60 కోట్లు

3300 ఎంహెచ్‌జడ్

22 ఎస్‌ఎస్‌ఏలలో 70 ఎంహెచ్‌జడ్‌

రూ. 26,184.20 కోట్లు

26 జీహెచ్‌జడ్‌

21 ఎల్‌ఎస్‌ఏలలో 800 ఎంహెచ్‌జడ్‌ మరియు 1 ఎల్‌ఎస్‌ఏలో 650 MHz

రూ. 6,564.93 కోట్లు

2500 ఎంహెచ్‌జడ్

6 LSAలలో 20 MHz మరియు 2 LSAలలో 10 ఎంహెచ్‌జడ్‌

రూ. 9,428.20 కోట్లు

 

ఇతర వస్తువులు

రూ. 531.89 కోట్లు

మొత్తం

రూ. 89,047.82 కోట్లు

 

 

ఈ స్పెక్ట్రమ్ కేటాయింపుతో బిఎస్‌ఎన్‌ఎల్‌ వీటిని చేయగలదు:

1.    దేశవ్యాప్తంగా 4జీ మరియు 5G సేవలను అందించడం

2.   వివిధ కనెక్టివిటీ ప్రాజెక్టుల కింద గ్రామీణ మరియు అన్‌కవర్డ్ గ్రామాలలో 4జీ కవరేజీని అందించడం

3.   హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలను అందించడం

4.   క్యాప్టివ్ నాన్-పబ్లిక్ నెట్‌వర్క్ (సిఎన్‌పిఎన్‌) కోసం సేవలు/స్పెక్ట్రమ్‌ను అందించడం

 

బిఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటిఎన్‌ఎల్‌ పునరుద్ధరణ:

·       ప్రభుత్వం 2019లో బిఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటిఎన్‌ఎల్‌ కోసం మొదటి పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. ఇది రూ. 69,000 కోట్లు. బిఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటిఎన్‌ఎల్‌లో ఇది స్థిరత్వాన్ని తీసుకువచ్చింది.

·       2022లో ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటిఎన్‌ఎల్‌ కోసం రూ. 1.64 లక్షల కోట్లతో రెండవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. ఇది క్యాపెక్స్‌కు ఆర్థిక మద్దతు. గ్రామీణ ల్యాండ్‌లైన్‌లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడానికి ఆర్థిక మద్దతు మరియు ఎజీఆర్‌  బకాయిల పరిష్కారం బిఎస్‌ఎన్‌ఎల్‌తో బిబిఎన్‌ఎల్‌ విలీనం మొదలైనవి అందించింది.

·       ఈ రెండు ప్యాకేజీల ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తం అప్పు రూ. రూ. 32,944 కోట్ల నుండి రూ. 22,289 కోట్లకు తగ్గింది.

·       బిఎస్‌ఎన్‌ఎల్‌ ముఖ్య ఆర్థికాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

 

 2020-21 ఆర్ధిక సంవత్సరం

 2021-22 ఆర్ధిక సంవత్సరం

2022-23 ఆర్ధిక సంవత్సరం

రాబడి

రూ.18,595 కోట్లు

రూ.19,053 కోట్లు

రూ.20,699 కోట్లు

నిర్వహణ లాభం

రూ.1,177 కోట్లు

రూ.944 కోట్లు

రూ.1,559 కోట్లు

 

 

  •  హోమ్ ఫైబర్ విభాగంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ బలమైన వృద్ధిని సాధించింది. ఇది ప్రతి నెలా 1 లక్షకు పైగా కొత్త కనెక్షన్‌లను అందిస్తోంది. మే 2023లో బిఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తం హోమ్ ఫైబర్ సబ్‌స్క్రైబర్ బేస్ 30.88 లక్షలు. హోమ్ ఫైబర్ ద్వారా గత ఏడాది మొత్తం ఆదాయం రూ. 2,071 కోట్లు ఆర్జించింది.

 

 

స్వదేశీ 4జీ/5జీ సాంకేతికత

 

·       టెలికాం టెక్నాలజీ అనేది ప్రపంచంలోని పరిమిత సంఖ్యలో ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ ప్రొవైడర్లతో కూడిన వ్యూహాత్మక సాంకేతికత.

·       గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆత్మనిర్భర్ దృష్టిలో భారతదేశ  స్వంత 4జీ/5జీ టెక్నాలజీ స్టాక్ విజయవంతంగా అభివృద్ధి చేయబడింది.

·       విస్తరణ ప్రారంభమైంది. కొన్ని నెలల ఫీల్డ్ విస్తరణ తర్వాత ఇది బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించబడుతుంది.

 *******



(Release ID: 1930508) Visitor Counter : 122