ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి సంగ్రహాలయం ను సందర్శించవలసింది గాప్రతి ఒక్కరినీ కోరిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 18 APR 2023 9:52AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ ను సందర్శించవలసింది గా ప్రతి ఒక్కరినీ కోరారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయ పర్యటన గురించి పూర్వ ప్రధాని దివంగత శ్రీ చంద్ర శేఖర్ కుమారుడు శ్రీ నీరజ్ శేఖర్ చేసిన ట్వీట్‌ కు, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

గొప్ప వ్యక్తిత్వం గల చంద్రశేఖర్ గారి తో సమయాన్ని గడపడం, తద్వారా అనేక విషయాలు ఆయన నుండి నేర్చుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ లో శ్రీ చంద్ర శేఖర్‌ గారి తోపాటు ఇతర ప్రధాన మంత్రులు దేశాని కి చేసిన సేవలను, వారి జీవితాన్ని గురించిన విశేషాలను తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు దీనిని సందర్శించాలని నేను కోరుతున్నాను’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1917634) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam