శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, బ్రిగేడియర్ బి.డి. మిశ్రా (రిటైర్డ్) కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశం - అభివృద్ధి అంశాలపై చర్చ


లడఖ్‌లో రాబోతున్న భారతదేశపు మొట్టమొదటి నైట్ స్కై అభయారణ్యం, యూటీ లో ఆస్ట్రో టూరిజానికి ఊతం

"మోదీ ప్రభుత్వంలో మొదటిసారిగా, లడఖ్‌కు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల, వైద్య కళాశాల మంజూరు అయింది"

Posted On: 31 MAR 2023 2:22PM by PIB Hyderabad

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, బ్రిగేడియర్  బి.డి. మిశ్రా (రిటైర్డ్) ఈరోజు కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్; పీఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో ఇక్కడ నార్త్ బ్లాక్‌లో సమావేశం అయ్యారు. లడఖ్‌లో రాబోయే భారతదేశపు మొదటి నైట్ స్కై అభయారణ్యం పురోగతిపై చర్చించారు, అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించిన అనేక ఇతర అంశాలను చర్చించారు. 

లడఖ్‌లో ఏర్పాటవుతున్న భారతదేశపు మొదటి నైట్ స్కై  అభయారణ్యం కేంద్రపాలిత ప్రాంతంలో ఆస్ట్రో టూరిజానికి ఊతం ఇస్తుందని,  ఆదాయంతో పాటు జీవనోపాధిని పొందుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియజేశారు. “ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి సిద్ధమైన తర్వాత, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని తన అనుకూలమైన తేదీలో ప్రారంభించవలసిందిగా అభ్యర్థిస్తాము” అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 

 

 

గత ఏడాది డిసెంబర్‌లో తూర్పు లడఖ్‌లోని హన్లే గ్రామంలో డార్క్ స్కై రిజర్వ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. 1,073 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నైట్ స్కై రిజర్వ్ చాంగ్‌తంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. 4500 మీటర్ల ఎత్తులో హాన్లేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రపంచంలోని రెండవ-అత్యున్నత ఆప్టికల్ టెలిస్కోప్ అయిన ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి ఆనుకొని ఉంది.

"ఈ డార్క్ స్కై రిజర్వ్ ప్రపంచంలోని 15 లేదా 16 రకాల్లో మాత్రమే ఉంది, ఇది రాత్రిపూట ఆకాశం అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. రెయిన్ షాడో ప్రాంతంలో హిమాలయాల అంతటా ఉన్న ఎత్తు, ప్రదేశం కారణంగా, ఈ నైట్ స్కై రిజర్వ్ దాదాపు ఏడాది పొడవునా నక్షత్రాలను చూసేవారికి అనువైన ప్రదేశం, ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

నైట్ స్కై రిజర్వ్ ఆస్ట్రో టూరిజం  పర్యావరణ అనుకూల కార్యకలాపాల ద్వారా జీవనోపాధిని ప్రోత్సహించడం, ఖగోళశాస్త్రం గురించి అవగాహన కల్పించడం, తగ్గిన కృత్రిమ కాంతి, వన్యప్రాణుల సంరక్షణతో శాస్త్రీయ పరిశోధనలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. లెహ్ బెర్రీ నుండి ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు, ఇది ఈ ప్రాంతంలోని పోషకాహార సమృద్ధిగా ఉన్న ఫలము.

 

 

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆ ప్రాంతపు ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తి అయిన "లేహ్ బెర్రీ"ని ప్రోత్సహిస్తోంది, అలాగే ఇది  విస్తృత స్థాయి వ్యవస్థాపకత,  జీవనోపాధి అవకాశాలను కూడా కలిగిస్తుంది. 
 

మే 2018లో ప్రధాని మోదీ లడఖ్ పర్యటనను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు, ఇందులో "లే బెర్రీ"కి మూలమైన సీ బక్‌థార్న్‌ను విస్తృతంగా సాగు చేయాలని ప్రధాని గట్టిగా సలహా ఇచ్చారు. ప్రస్తుతం వైల్డ్ సీ బక్‌థార్న్ ప్లాంట్ నుండి 10% కాయలు మాత్రమే తీయగలుగుతున్నందున, స్థానిక రైతులు, స్వయం సహాయక బృందాలు ఉపయోగించుకునేలా హార్వెస్టింగ్ యంత్రాలను కూడా  సీఎస్ఐఆర్  అభివృద్ధి చేస్తోందని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ లడఖ్, దేశంలోని ఇతర మారుమూల ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. "మోదీ ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా, లడఖ్‌కు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసామని, మెడికల్ కాలేజీ కూడా గత సంవత్సరం నుండి అకడమిక్ సెషన్‌లను ప్రారంభించిందని ఆయన చెప్పారు.

సరిహద్దు ప్రాంతంలో వ్యూహాత్మక అంశాలు, స్థానిక పరిపాలనా వ్యవహారాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

 

*****



(Release ID: 1912760) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi