విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పారదర్శక పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా తమ అవసరాలకు అనుగుణంగా ప్రతి జెన్ కో - కేంద్ర/ రాష్ట్ర/ ఐపిపిలు బొగ్గును సేకరిస్తాయిః కేంద్ర విద్యుత్ & ఎన్ఆర్ఇ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్
Posted On:
28 MAR 2023 5:57PM by PIB Hyderabad
మిశ్రణం కోసం బొగ్గును 2009 నుంచి థర్మల్ పవర్ ప్లాంట్లు (టిపిపిలు) దిగగుమతి చేసుకుంటున్నాయి. ఈ దిగుమతులు 2015-16లో గరిష్టంగా 48.8 మెట్రిక్ టన్నుల నుంచి 2019-20లో 23.8 మెట్రిక్ టన్నుల మధ్య ఉన్నాయి. మిశ్రణం కోసం దిగుమతులను తగ్గించుకోవలసిందిగా విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎంఒపి) రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. ఫలితంగా, దిగుమతులు 2021-22లో 8.1 ఎంటిలకు క్షీణించాయి.
సంవత్సరంలో టిటిపిలు నాన్ పిట్హెడ్ ప్లాంట్లలో 20 నుంచి 26 రోజులు, 12 నుంచి 17 రోజులు పిట్హెడ్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను రోజుల సంఖ్యలో నెలవారీ తేడాతో నిర్వహించాలని, దానివల్ల పవర్ ప్లాంట్ల వద్ద అత్యధిక డిమాండ్ సమయంలో తగినంత బొగ్గు నిల్వలు ఉంచుకోవటాన్ని కేంద్ర విద్యుత్ ప్రాధికారణ బొగ్గు నిల్వ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.
దేశీయ బొగ్గు సరఫరా అవసరానికి అనుగుణంగా లేదు. దీనివల్ల మిశ్రణం కోసం బొగ్గును దిగుమతి చేసుకోవలసిన అవసరం వచ్చింది. కనుక, కేంద్ర, రాష్ట్ర జెన్కోలను, ఐపిపిలను తగిన చర్యలు తీసుకుని, సెప్టెంబర్ 2023 వరకు కార్యకలాపాల కోసం తమ విద్యుత్ ప్లాంట్లలో తగిన బొగ్గు నిల్వలను కలిగి ఉండటానికి బరువులో 6% చొప్పున మిశ్రణం చేయడం కోసం పారదర్శక పోటీ సేకరణ ప్రక్రియ ద్వారా బొగ్గును సకరించేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
రోజువారీ బొగ్గు వినియోగం - దేశీయ బొగ్గు రాకపోకల మధ్య కొరత 2022 ఏప్రిల్ - 2023 జనవరి నెలల మధ్య 2.21 లక్షల టన్నుల నుంచి 0.5 లక్షల టన్నుల వరకు ఉంది. ఒకవేళ మిశ్రణం కోసం దిగుమతులు లేకపోయి ఉంటే, డిసిబి ప్లాంట్లలో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు 2022, సెప్టెంబర్ నాటికి సున్నాకి తగ్గిపోయేవి. ఆర్థిక సంవత్సరం 2022--23 తొలి ప్రథమార్ధంలో సగటు క్షీణత రోజుకు దాదాపు 1.6 లక్షల టన్నులుగా ఉంది. తరువాత, బొగ్గు నిల్వలు కోలుకుంటున్న సంకేతాలను చూపాయి. నిల్వల స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ మొత్తం సరఫరా, నిల్వల పరిస్థితి (అవసరం ఆధారంగా మిశ్రణం)ను పరిగణనలోకి తీసుకుని వారి స్థాయిలో మిశ్రణానికి సంబంధించి నిర్ణయం తీసుకోవలసిందిగా 01.08.2022న విద్యుత్ మంత్రిత్వ శాఖ జెన్కోలకు సూచించింది.
ఈ వేసవిలో సగటు డిమాండ్ అంచనాలు 210 -220 జిడబ్ల్యులు, గరిష్టంగా దాదాపు 230 జిడబ్ల్యువరకు ఉంటుంది, పైన పేర్కొన్న ఏర్పాట్లతో దీనిని నెరవేర్చవచ్చు.
బొగ్గు ఎగుమతులు ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఒజిఎల్- బహిరంగ సాధారణ లైసెన్స్) కింద ఉంటుంది. టిపిపిలు తమ బొగ్గు అవసరాలను నెరవేర్చుకోవడానికి బొగ్గును దిగుమతిని చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ప్రతి జెన్ కో- కేంద్ర/ రాష్ట్ర/ ఐపిపి తమ అవసరాల కోసం పారదర్శక పోటీ బిడ్డింగ్ ప్రక్రియకు అనుగుణంగా బొగ్గును సేకరించుకుంటాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ మంగళవారం రాజ్యసభకు వెల్లడించారు.
***
(Release ID: 1911711)