ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అవయవ దానం మరియు మార్పిడి కోసం "ఒక దేశం.. ఒకే విధానం"


- కొత్త ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ అర్హత కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు

మరణించిన దాత అవయవాన్ని స్వీకరించడం తొలగించబడింది

Posted On: 24 MAR 2023 5:30PM by PIB Hyderabad

అవయవ దానం మరియు మార్పిడి కోసం భారత ప్రభుత్వం "ఒక దేశం, ఒకే విధానం" విధానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం, మరణించిన దాత నుండి అవయవ మార్పిడి అవసరమయ్యే రోగుల నమోదు కోసం రాష్ట్ర నివాస అవసరాన్ని తొలగించాలని నిర్ణయించబడింది. ఇప్పుడు అలాంటి రోగులు దేశంలోని ఏ రాష్ట్రానికైనా వెళ్లి అవయవ మార్పిడి కోసం తమను తాము నమోదు చేసుకోగలుగుతారు. కొత్త ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, మరణించిన దాత అవయవాన్ని స్వీకరించడానికి రిజిస్ట్రేషన్ కోసం అర్హత కోసం గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లు నిబంధన తీసివేయబడింది.  ఇప్పుడు, ఏ వయస్సులోనైనా మరణించిన దాత అవయవాన్ని స్వీకరించడానికి నమోదు చేసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక  లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.

****



(Release ID: 1910572) Visitor Counter : 130


Read this release in: English , Urdu