పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించడానికి చర్యలు

Posted On: 23 MAR 2023 4:04PM by PIB Hyderabad

ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలలో రద్దీని తగ్గించడానికి అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. అమలు జరుగుతున్న చర్యలు : -

 

i. వాహనాల రద్దీ ని నివారించడానికి నిష్క్రమణ మార్గాల వద్ద   అదనపు ట్రాఫిక్ సిబ్బంది నియామకం 

ii.ముఖ్యమైన ప్రాంతాల వద్ద ఎంట్రీ గేట్ నంబర్‌తో పాటు కనీసం వేచి ఉండే సమయాన్ని ప్రదర్శించే బోర్డును ఏర్పాటు చేసి ప్రయాణీకులకు ముందస్తు సమాచారం 

iii. వెయిటింగ్ టైమ్‌కి సంబంధించితాజా సమాచారం  అందించే విధంగా ప్రవేశ ఎంట్రీ గేట్ల వద్ద డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు.  దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా అందిస్తున్నారు.

iv.  ఎయిర్ టికెట్/బోర్డింగ్ పాస్ , గుర్తింపు పత్రాలు   సిద్ధంగా ఉండాలని ప్రయాణికులకు సూచనలు ఇచ్చే విధంగా ప్రవేశ ద్వారం వద్ద అవగాహన పోస్టర్ చేయడంతో పాటు  ప్రయాణికుల సహాయార్థం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక సిబ్బంది నియామకం 

v. ప్రయాణీకుల ప్రవేశం కోసం అదనపు ప్రవేశ ద్వారాలు తెరవబడ్డాయి.

vi. ఢిల్లీ విమానాశ్రయంలో  టెర్మినల్ 3 లోపల కొత్త సెక్యూరిటీ జోన్ 0 ఏర్పాటు 

vii. సెక్యూరిటీ పాయింట్ల వద్ద ఆటంకాలు లేకుండా చూడడానికి  సామాను తనిఖీ కోసం అదనపు ఎక్స్-రే యంత్రాలను నెలకొల్పి ప్రారంభించడం జరిగింది.  

viii. ఢిల్లీ విమానాశ్రయంలో అదనంగా 15 ఎక్స్ -బిఐఎస్ యంత్రాలు ఏర్పాటయ్యాయి. టీ -3 డొమెస్టిక్‌లో  25 కి , టీ -3 ఇంటర్నేషనల్‌లో 19కి చేరుకున్న మొత్తం ఎక్స్  -రే యంత్రాల సంఖ్య

ix.  ఆపరేటర్ డొమెస్టిక్ టు డొమెస్టిక్ (D2D) బదిలీ సదుపాయాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్ ప్రారంభించింది. ప్రయాణికులు, సిబ్బంది బదిలీ చేయడానికి పడుతున్న  సమయాన్ని తగ్గించి, వారి విమాన షెడ్యూల్‌ను ప్లాన్ చేయడంలో, విమాన సిబ్బంది  సభ్యుల రోస్టరింగ్‌లో ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు ఈ సౌకర్యం ప్రయాజనం కలిగిస్తుంది.  ప్రయాణికుల వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ముంబై విమానాశ్రయంలో మూడు కొత్త భద్రతా మార్గాలు ప్రారంభం అయ్యాయి. 

x  అదనపు సిబ్బందిని  సీఐఎస్ఎఫ్  నియమించడానికి చర్యలు 

xi సీసీటీవీ,  కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ 

xii. రద్దీ నియంత్రణ  కోసం కౌంట్ మీటర్ వినియోగం 

xiii. రద్దీ సమయాల్లో విమానాల సంఖ్య పెంచడానికి  స్లాట్‌లను మార్చడం ద్వారాటెర్మినళ్ల మధ్య  ట్రాఫిక్‌ నియంత్రించాలని  ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లకు సూచనలు జారీ  

xiv. అన్ని చెక్-ఇన్/బ్యాగేజీ డ్రాప్ కౌంటర్ల వద్ద తగినంత మంది సిబ్బందిని నియమించాలని  విమానయాన సంస్థలకు ఆదేశాలు 

xv. విదేశాల నుంచి వస్తున్న  అంతర్జాతీయ ప్రయాణీకులు డిసెంబార్కేషన్ కార్డ్‌లను విమానంలోనే నింపాలని సూచన.  ఫారమ్‌ను పూరించడానికి ప్రయాణికులకు సహాయం చేయడానికి విమానాలు  దిగే ప్రదేశాల వద్ద సిబ్బంది  నియామకం.

xvi  ఎలాంటి సమస్యలు లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బయోమెట్రిక్ ఆధారిత   డిజీయాత్ర ఉపయోగించమని విమాన ప్రయాణికులకు వినతి డిజియాత్ర ప్లాట్‌ఫారమ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి విమానంలో ప్రకటన చేయబడుతుంది.

xvii. ఆటోమేటెడ్ ఎంట్రీని సులభతరం చేయడానికి అన్ని ఎంట్రీ గేట్ల వద్ద 2D బార్ కోడ్ స్కానర్ల ఏర్పాటు

xviii. ఎంట్రీ/సెక్యూరిటీ గేట్ వద్ద ప్రయాణికులు సులభంగా వెళ్లేందుకు, జారీ చేసిన టిక్కెట్లపై బార్‌కోడ్‌ను పూర్తిగా పాటించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ 

xix. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  స్థాయిలో ఉపశమన చర్యలు మేలు జరిగేలా  రోజువారీగా పర్యవేక్షణ 

 

ఈ చర్యలన్నీ విమానాశ్రయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు జరుగుతాయి.

 

ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు.

 

*****


(Release ID: 1910188)
Read this release in: English , Urdu , Tamil