రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నాలుగు రాష్ట్రాల్లో గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ అమలు

Posted On: 15 MAR 2023 4:09PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్రాజస్థాన్ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 781 కి.మీ పొడవున గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్ (జి.ఎన్.హెచ్.సి.పినిర్మాణానికి గాను కావాల్సిన రుణ సహాయానికి సంబంధించి భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు ఒక ఒప్పందంపై సంతకం చేశాయిమొత్తం ప్రాజెక్ట్ వ్యయం 1288.24 మిలియన్ల అమెరికా డాలర్లకు (రూ. 7,662.47 కోట్లు) 500 మిలియన్ డాలర్ల రుణ సహాయానికి సంబంధించి ఈ రుణ ఒప్పందం జరిగింది.  జి.ఎన్.హెచ్.సి.పి లక్ష్యం సిమెంట్ ట్రీట్ చేయబడిన సబ్ బేస్/రీక్లెయిమ్డ్ తారు పేవ్‌మెంట్, సున్నం వంటి స్థానిక/ ఉపాంత పదార్థాలను ఉపయోగించడం ద్వారా సహజ వనరులను పరిరక్షించే నిబంధనలను చేర్చడం. తద్వారా వాతావరణ స్థితిస్థాపకత మరియు గ్రీన్ టెక్నాలజీల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన మరియు గ్రీన్ రహదారి ఏర్పాటు. ఫ్లై యాష్, వ్యర్థ ప్లాస్టిక్, హైడ్రోసీడింగ్, కోకో/జూట్ ఫైబర్ వంటి వాటితో స్లోప్ ప్రొటెక్షన్ కోసం బయో-ఇంజనీరింగ్ చర్యలు, ఇది గ్రీన్ టెక్నాలజీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో మంత్రిత్వ శాఖ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

                                                           

*****



(Release ID: 1907385) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Marathi , Tamil