నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ సర్బానంద సోనోవాల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని బోలెంగ్‌లో యూనియింగ్ ఉత్సవాన్ని జరుపుకున్నారు


యూనియింగ్ పండుగ వసంత ఋతువు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే ఆది సామాజిక వర్గ పండుగ

పండుగలో పవిత్రమైన ఆరాధన వేడుక సంబరాలు ప్రదర్శించడం ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌కు బలం చేకూరుస్తుంది

Posted On: 25 FEB 2023 8:06PM by PIB Hyderabad

కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్‌లోని బోలెంగ్‌లో ఆది సమాజం యొక్క ముఖ్యమైన పండుగ అయిన రంగుల సియాంగ్ యూనియింగ్ ఉత్సవానికి హాజరయ్యారు.

 

సాగు సీజన్, ఆది సమాజం యొక్క కొత్త సంవత్సరం ప్రారంభం, వసంత రుతువుల ఆగమనం మరియు సమాజం మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి గొప్ప మార్గంగా చెప్పడానికి యూనియింగ్ పండుగ జరుపుకుంటారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, “ఈ రోజు ఇక్కడ జరిగే పవిత్రమైన రంగుల సియాంగ్ యూనియింగ్ ఉత్సవానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. మన  అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు, మరియు ఈశాన్య భారతదేశం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు దేశానికి ప్రత్యేకమైన నిధి. ఆది సమాజంలో ఇటువంటి పవిత్రమైన ఆరాధన, వేడుక సంబరాల ప్రదర్శనను చూడడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తికి ఇది సరైన ఉదాహరణ. మీరు ప్రేమ, కరుణ మరియు శ్రద్ధతో ప్రకృతి మాత ప్రసాదాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా సోదరులు మరియు సోదరీమణులందరికీ ఈ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను" అని ఆయన అన్నారు.

 

ఈ ఉత్సవానికి అరుణాచల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ ఎంపీ అయిన తపిర్ గావ్ కూడా హాజరయ్యారు.

***


(Release ID: 1902501) Visitor Counter : 261
Read this release in: English , Hindi , Manipuri