సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌జీఎంఏ ఎయిర్ ఇండియా కళాఖండాల విలువైన సేకరణ ‘మహారాజా కలెక్షన్’ను భద్రపరుస్తుంది.


ఆర్ట్‌వర్క్‌లను ఎన్‌జీఎంఏకు అప్పగించేందుకు ఈరోజు ఎంఓయూ కుదిరింది

Posted On: 18 JAN 2023 7:01PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

  • సేకరణను అందజేసే కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
  • ఎయిర్ ఇండియా కలెక్షన్‌లో ఉన్న ఆధునిక మరియు సమకాలీన కళాఖండాలలో బి ప్రభ, శంకర్ పల్సికర్, లక్ష్మణ్ పాయ్, వాసుదేవ్ గైతోండే, ఎమ్ ఎఫ్ హుస్సేన్, అర్పణా కౌర్ వంటి కళాకారులవి ఉన్నాయి.

నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ఆఫ్ మినిస్ట్రి ఆఫ్ కల్చర్‌లో ఎయిర్ ఇండియా కళాఖండాల విలువైన సేకరణ ‘మహారాజా కలెక్షన్’ ఉంటుంది. ఈరోజు న్యూఢిల్లీలోని ఎన్‌జిఎంఏ ప్రాంగణంలో ఎన్‌జీఎంఓకి కళాఖండాలను అందజేసేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంఓయూ సంతకాల కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎంఓయూపై సంస్కృతిక మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ముగ్ధా సిన్హా సంతకం చేశారు. కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ సత్యేంద్ర కుమార్ మిశ్రా; ఎన్‌జిఎంఏ డైరెక్టర్ శ్రీమతి టెంసునారో త్రిపాఠి, ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఐఏహెచ్‌ఎల్) సిఎండి  శ్రీ విక్రమ్ దేవ్ దత్ మరియు ఎయిర్‌ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి ఎంఎస్ కల్పనా రావు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

image.png

image.png


ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక సౌరభం, నైతిక విలువలతో కూడిన ఐదువేల సంవత్సరాల పురాతన చరిత్ర భారతదేశానికి ఉందన్నారు. భారతదేశం ఆర్థిక శక్తిగా మారడమే కాకుండా ప్రపంచ వేదికపై సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని కూడా ప్రధాన మంత్రి నొక్కిచెబుతున్నారని అన్నారు.

 

image.png


ఎయిర్ ఇండియాకు చెందిన కళాకారులు మరియు కళా సేకరణలు భారతీయ సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్ట్ సేకరణలో జతిన్ దాస్, అంజలి ఎలా మీనన్, ఎంఎఫ్ హుస్సేన్ మరియు రాధాజీ వంటి ప్రముఖ కళాకారుల చిత్రాలు ఉన్నాయి. కళాఖండాల ప్రదర్శన కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని తద్వారా భారతీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు వైభవాన్ని ప్రదర్శించాలని శ్రీ సింధియా సూచించారు.

ఈ రంగంలో ఎయిర్ ఇండియా తనదైన రీతిలో అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి అన్నారు. భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఆకాశంలో భారతీయ జెండాను ఎగురవేయడమే కాకుండా భారతీయ వారసత్వం మరియు సంస్కృతికి అంబాసిడర్‌గా కూడా పనిచేశారని తెలిపారు. జేఆర్‌డి టాటా తన ముందుచూపుతో మరియు మార్గదర్శకుడిగా ఉన్నందుకు ఆయన ప్రశంసించారు. ఎన్‌జీఎంఏకు అందజేస్తున్న షోపీస్‌లలో ఆధునిక కళాఖండాలు మాత్రమే కాకుండా అనేక రకాలైన చేనేత, శిల్పాలు, ఇతర కళాఖండాలు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ..చారిత్రాత్మక ఎమ్ఒయు ద్వారా 1953 నుండి ఎయిరిండియా యొక్క అమూల్యమైన కళాఖండాల సేకరణను సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌జిఎంఏకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. పెయింటింగ్స్, ఆర్ట్‌వర్క్‌లు ఇప్పుడు వాటి సరైన స్థానాన్ని పొందుతాయన్నారు. అంటే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ అని తెలిపారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దృక్కోణంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన సంస్కృతిని పరిరక్షించడానికి మరియు ప్రజల ముందుకు తీసుకురావడానికి మరియు యువతతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ప్రధాన మంత్రి ‘వికాస్ భీ విరాసత్ భీ’ విజన్ ప్రకారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిరంతరం పనిచేస్తోందని ఆయన అన్నారు. ఎయిరిండియా మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ విలువైన కళాఖండాలను సంరక్షించడానికి మరియు రక్షించడానికి కృషి చేశాయి..కాబట్టి ఈ కళాకృతులను రాబోయే తరాలకు భద్రపరుస్తామని తాను హామీ ఇస్తున్నానని మంత్రి పునరుద్ఘాటించారు. త్వరలో విడుదల కానున్న షెడ్యూల్‌లో ఈ సేకరణను కళాభిమానుల ముందు ప్రదర్శిస్తామని కూడా ఆయన
వెల్లడించారు. ఇది వినూత్న డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా విదేశాల్లోని ప్రేక్షకులకు కూడా తెరవబడుతుందని తెలిపారు. ఎన్‌జీఎంఏకు చెందిన కళా నిధికి విలువైన సహకారం అందించిన పౌర విమానాయానశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

image.png


ఎనభై ఏళ్లపాటు వాణిజ్య విమానయాన సంస్థగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్ ఇండియా విస్తృత ప్రయాణంలో పెయింటింగ్‌లు, శిల్పాలు, చెక్కతో చేసిన కళాకృతులు, గాజు పెయింటింగ్‌లు, అలంకార వస్తువులు, వస్త్ర కళ, ఛాయాచిత్రాలతో కూడిన భారీ సంఖ్యలో విలువైన కళాఖండాలను  కొనుగోలు చేయడంతో పాటు సేకరించింది.  ఈ కళా వస్తువులు ఎన్‌జిఎంఏ వద్ద సేకరణలో భాగంగా ఉంటాయి.

image.png


సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమూల్యమైన సేకరణను కొనుగోలు చేయడం కోసం తీసుకున్న నిర్ణయం మరియు ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుండి సేకరణను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌కు బదిలీ చేయాలనే నిర్ణయం చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది.

image.png


ఎయిర్ ఇండియా కలెక్షన్‌లో  ఆధునిక మరియు సమకాలీన కళాకృతులు ఉన్నాయి. వాటిలో బి ప్రభ, శంకర్ పల్సికర్, లక్ష్మణ్ పాయ్, వాసుదేవ్ గైతోండే, ఎమ్ ఎఫ్ హుస్సేన్, ఎస్ హెచ్ రజా, కె హెచ్ అరా మరియు ఇతర ప్రోగ్రెసివ్ ఆర్ట్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుల కళాకృతులు ఉన్నాయి. మార్గదర్శక కళాకారుడు హరి అంబదాస్ గాడే కలెక్షన్‌ కూడా ఇందులో ఉంది. అంజోలీ ఎలా మీనన్ మరియు జతిన్ దాస్ వంటి లివింగ్ లెజెండ్‌ల ఆర్క్స్ ఆఫ్ ఆర్ట్స్‌ ఎన్‌జిఎంఏ సేకరణను మరింత మెరుగుపరుస్తుంది.

 

image.png


ఎన్‌జిఎంఏ గురించి:
ఎన్‌జిఎంఏ 1850 నుండి కళాఖండాలను సంపాదించి భద్రపరిచింది. ఎన్‌జిఎంఏ కళా సేకరణ విస్తారమైనది మరియు పరిశీలనాత్మకమైనది. అందులోని 18,000 రచనలు (సుమారుగా) వర్తమానానికి నివాళులు అర్పించినప్పటికీ గొప్ప మరియు అద్భుతమైన గతానికి సాక్ష్యమిస్తున్నాయి. దీని సంపద ఆధునికవాద జోక్యాలు మరియు ఏయు కౌరంట్ సమకాలీన వ్యక్తీకరణల వరకు విస్తరించింది.


 

 ****



(Release ID: 1892076) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi