ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022-23 ఆర్థిక సంవత్సరంలో 10.11.2022 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
Posted On:
11 NOV 2022 7:35PM by PIB Hyderabad
2022-23 ఆర్థిక సంవత్సరంలో 10.11.2022 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని సాధిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ 10 వరకు ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లు. గత సంవత్సరం ఇదే కాలంలోని స్థూల వసూళ్ల కంటే ఇది 30.69% ఎక్కువ. వాపసులు (రీఫండ్లు) పోను నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లు. గత సంవత్సరం ఇదే కాలంలోని నికర వసూళ్ల కంటే ఇది 25.71% ఎక్కువ. FY 2022-23కి సంబంధించిన ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది 61.31% వసూళ్లకు సమానం.
స్థూల ఆదాయ పన్ను వసూళ్ల ప్రాతిపదికన కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వృద్ధి రేటును పరిశీలిస్తే, సీఐటీ వృద్ధి రేటు 22.03% కాగా, పీఐటీ (ఎస్టీటీ సహా) వృద్ధి రేటు 40.64%. వాపసుల సర్దుబాటు తర్వాత సీఐటీ వసూళ్లలో నికర వృద్ధి 24.51%. ఎస్టీటీ మినహాయించి పీఐటీ వసూళ్లలో నికర వృద్ధి 28.06%, ఎస్టీటీతో కలిపి పీఐటీ వసూళ్లలో నికర వృద్ధి 27%.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు రూ.1.83 లక్షల కోట్ల వాపసులు జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన వాపసుల కంటే ఇది 61.07% ఎక్కువ.
****
(Release ID: 1875552)
Visitor Counter : 219